English | Telugu

`కార్తీక దీపం` షాకింగ్‌ ట్విస్ట్ అదిరింది

దేశ వ్యాప్తంగా నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్‌గా పేరు తెచ్చుకున్న ధారావాహిక `కార్తీక దీపం`. రేటింగ్ విష‌యంలోనూ సంచ‌ల‌నం సృష్టించిన కార్తీక దీపం గ‌త కొన్ని రోజులుగా చిత్ర విచిత్ర‌మైన మ‌లుపుల‌తో ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తోంది. డాక్ట‌ర్ బాబు - దీపా క‌ల‌వ‌డం.. మోనిత జైలుకి వెళ్ల‌డంతో ఎండ్ కార్డ్ ప‌డాల్సిన ఈ సీరియ‌ల్‌ని బ‌త్తాయి ర‌సంలా పిండేస్తూ ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర సాగ‌దీస్తున్నారు.

దీంతో అమితంగా అభిమానించిన ప్రేక్ష‌కులు ఈ సీరియ‌ల్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ సీరియ‌ల్ రేటింగ్ కూడా దారుణంగా ప‌డిపోవ‌డంతో ఇప్ప‌టికైనా ఈ సీరియ‌ల్‌ని ఆపేయ‌డం బెట‌ర‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సోమ‌వారం ఎపిసోడ్ కు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు కాపుగంటి రాజేంద్ర‌. దీంతో ఆడియ‌న్స్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 1197వ ఎపిసోడ్‌లోకి ఎంట‌రైన ఈ సీరియ‌ల్ అదిరిపోయే ట్విస్ట్‌తో స‌రికొత్త మ‌లుపు తిరిగింది.

మోనిత‌కు పుట్టిన కొడుకు పేగు మెడ‌లో వేసుకుని పుట్టాడ‌ని.. దాని వ‌ల్ల తండ్రికి ప్రాణ‌గండ‌మ‌ని తెలియ‌డంతో కార్తీక్ త‌ల్లి మోనిత‌తో క‌లిసి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేయిస్తుంది. అయితే దీని వెన‌క డాక్ట‌ర్ భార‌తి చెప్పిన ఓ అబ‌ద్ధం కార‌ణ‌మ‌ని తెలియ‌డం ప్రేక్ష‌కుల‌ని షాక్‌కు గురిచేస్తోంది. ఇన్ని ట్విస్ట్‌ల మ‌ధ్య ఇదేం ట్విస్ట్ అంటూ త‌ల బాదుకుంటున్నారు. క‌ట్ చేస్తే నా వంట‌కు ఎన్ని మార్కులు వేస్తావ‌ని దీప డాక్ట‌ర్ బాబుని అడుగుతుంది. దానికి ప‌దికి ప‌ది అని చెబుతాడు. దానికి దీప మీరు అన్నీ అబ‌ద్ధాలే చెబుతున్నారంటుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. కార్తీక దీపంలో సోమ‌వారం ఎలాంటి ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిదే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.