English | Telugu

బిగ్‌బాస్ 'వీజే'త స‌న్నీకి ద‌క్కింది ఎంత‌?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 మొత్తానికి ముగిసింది. ఈ సీజ‌న్ లో గ‌త రెండు మూడు వారాలుగా విజేత ఎవ‌ర‌న్న‌ది ముందుగానే తెలిసిపోయింది. న‌వ‌ర‌సాల‌ని పండించి.. అనుభవించిన వాడిదే ప‌రిపూర్ణ జీవితం అంటారు. బిగ్‌బాస్ జ‌ర్నీలో స‌న్నీ ఆట తీరుని గ‌మ‌నిస్తే అదే క‌నిపించింది. అందుకే అత‌ను విజేత‌గా నిలిచాడు. అంతే కాకుండా త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో క‌ప్పు తో పాటు కోట్ల మంది హృద‌యాల్ని గెలుచుకున్నాడు. అంతే కాకుండా భారీ స్థాయిలో ప్రైజ్ మ‌నీని కూడా సొంతం చేసుకున్నాడు.

గ‌త సీజ‌న్‌ల తో పోలిస్తే తాజా సీజ‌న్ విజేత‌గా వీజే స‌న్నీ ద‌క్కించుకుందే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్రైజ్ మ‌నీ కింద 50 ల‌క్ష‌ల‌తో పాటు సువ‌ర్ణ‌భూమి వారి 300 గ‌జాల స్థ‌లం, ట‌వీఎస్ స్పోర్ట్స్ బైక్‌.. అలాగే డైలీ ఇచ్చే రెమ్యున‌రేష‌న్ అంతా కలిపి చూస్తే భారీగానే స‌న్నీకి అందిన‌ట్టుగా తెలుస్తోంది. దాదాపుగా కోటికి మించే స‌న్నీకి అందిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. ఇలా ఇంత వ‌ర‌కు ఓ కంటెస్టెంట్ ఈ స్థాయిలో ప్రైజ్ మ‌నీని అందుకున్న దాఖ‌లాలు లేవు. టైమ్‌... మాన‌వ ప్ర‌య‌త్నం.. దానికి దైవం అండ‌గా నిలిస్తే అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చ‌ని ప‌క్క‌వారు ద్వేషిస్తున్నా...వారికి ప్రేమ‌ని పంచి వారి హృద‌యాల్ని గెలుచుకోవాల‌ని బిగ్‌బాస్ వేదిక‌గా వీజే స‌న్నీ నిరూపించాడు.

అందుకే 19 మంది కంటెస్టెంట్ ల‌తో మొద‌లైన ఈ షోలో ఫైన‌ల్ గా ఆల్ ఎమోష‌న్స్‌ని పండించిన వ్య‌క్తిగా నిలిచి స‌న్నీ విజేత అయ్యాడు. విజేత‌గా స‌న్నీని ప్ర‌క‌టించిన వేళ అత‌నిలో వున్న చిన్న త‌నం బ‌య‌టికి వ‌చ్చి గెంతులేసింది. ప‌క్క‌న నాగ్ స‌ర్ వున్నాడ‌న్న విష‌యాన్ని మ‌రిచి త‌న్మ‌య‌త్వంతో సాధించాన‌న్న సంబ‌రం స‌న్నీ క‌ళ్ల‌ల్లో క‌నిపించింది. క‌ప్పు ముఖ్యం బిగులూ.. అప్నా టైమ్ ఆయేగా ... మ‌చ్చా.. అంటూ స‌న్నీ ప‌లికిన మాట‌లే బిగ్‌బాస్ ఫైన‌ల్ లో అక్ష‌ర స‌త్యాలుగా నిల‌వ‌డం.. ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.