English | Telugu

గ్రాండ్ ఫినాలే సాక్షిగా వ‌క్ర‌బుద్ది చూపించిన ష‌ణ్ముఖ్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలేలో వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. ఆల్ ఎమోష‌న్స్‌ని ప‌లికించిన ప‌రిపూర్ణ‌మైన వ్య‌క్తిగా ఆక‌ట్టుకున్న స‌న్నీత‌న ప్ర‌వ‌ర్త‌న‌తో కోట్లాది మంది హృద‌యాల్ని గెలుచుకుని విజేత అయ్యాడు. బిగ్‌బాస్ టైటిల్ తో పాటు భారీ స్థాయిలోనే ప్రైజ్ మ‌నీని ద‌క్కించుకుని బిగ్‌బాస్ సీజ‌న్ విజేత‌ల్లో హాట్ టాపిక్ గా మారాడు. అయితే ఈ ప‌రిణామం ముందు నుంచి టైటిల్ విజేత‌ను తానే అనుకుంటూ వ‌స్తున్న యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్‌బాస్ స్టేజ్ పై త‌న వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టాడు.

స‌న్నీ విజేత‌గా నిలిచి షాకివ్వ‌డంతో మైండ్ బ్లాక్ అయిన ష‌న్ను స్టేజ్ పై త‌న వ‌క్క బుద్దిని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాడు. దీంతో అత‌నిపై నెట్టింట ట్రోలింగ్ మొద‌లైంది. ష‌న్ను ర‌న్న‌ర్‌గా నిల‌వ‌డానికి అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌తో పాటు సిరితో వ్య‌వ‌హ‌రించిన తీరే ప్ర‌ధాన కార‌ణం. యూట్యూబ్‌లొ భారీ ఫ్యాన్ బేస్‌ని సొంతం చేసుకున్న ష‌ణ్ముక్ అస‌లు బండారం బిగ్‌బాస్ హౌస్ లోకి వచ్చాకే బ‌య‌ట‌కి తెలిసింది. సిరితో బాత్రూమ్ వ‌ద్ద చేసిన ప‌నుల‌కు, మోజ్ రూమ్ సాక్షిగా సిరిని టార్చ‌ర్ పెట్టిన తీరుకే ష‌న్నుని ప్రేక్ష‌కులు ర‌న్న‌ర్ గా నిల‌బెట్టారు.

అయితే ఇంత జ‌రిగినా.. త‌న‌ని విజ‌యం అప‌హాస్య‌వం చేసినా స‌న్నీని విజేత‌గా నిలిపినా త‌న త‌ప్పేంటో తెలుసుకోలేక గ్రాండ్ ఫినాలే స్టేజ్ సాక్షిగా మ‌రోసారి ష‌న్ను త‌న వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టాడు. స‌న్నీని విజేత‌గా ప్ర‌క‌టించిన త‌రువాత ర‌న్న‌ర్ స్పీచ్ కావాల‌ని నాగార్జున అడిగితే ష‌ణ్నూ మాట్లాడిన తీరు అత‌ని వ‌క్ర బుద్దిని బ‌య‌ట‌పెట్టింది. `ప‌ర్లేదు.. ప‌ర్లేదు.. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్న‌దే ముఖ్యం` అంటూ త‌న‌లో దాగి వున్న విషాన్ని వెల్ల‌గ‌క్కాడు. దీంతో నెట్టింట ష‌న్నూని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు నెటిజ‌న్స్. విన్నింగ్ ముఖ్యం కాదు అన్న‌ప్పుడు ఇన్ని రోజులు హౌస్ లో ఎందుకున్నావ‌ని ర‌న్న‌ర్ గా మిగిలినా ఇంకా బుద్ది రాలేద‌ని తిట్టిపోస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.