English | Telugu

 కాజ‌ల్ ఎలిమినేష‌న్‌కు కార‌ణాలు ఇవేనా?

12వ వారం యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ కావ‌డం తెలిసిందే. అయితే ఇది అన్యాయం అక్ర‌మ‌మ‌ని .. కుట్ర చేసి ర‌విని ఇంటి నుంచి బ‌య‌టికి పంపించార‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి. తాజాగా జ‌రిగిన కాజ‌ల్ ఎలిమినేట్ వెన‌క అయితే ఎలాంటి కుట్ర లేదు.. కుతంత్రం లేదు. కార‌ణం హౌస్ లో వున్న కంటెస్టెంట్ ల‌తో పోలిస్తే కాజ‌ల్ కు ఓటింగ్ త‌క్కువ‌గా న‌మోదు కావ‌డ‌మే. అయితే ఆమె వెన‌క‌బ‌డ‌టానికి, హౌస్ నుంచి బ‌య‌టికి రావ‌డానికి కార‌ణం ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ముందే గేమ్ ప్లాన్ ని యాంక‌ర్ ర‌విలా సిద్ధం చేసుకుని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజ‌ల్ త‌ను ఫాలో అయిన స్ట్రాట‌జీనే ఇంటి దారి ప‌ట్టించింద‌ని చెబుతున్నారు. ప్రతీ విష‌యంలోనూ త‌ల‌దూర్చ‌డం.. గిల్లిక‌జ్జాల‌కు దిగ‌డం.. దీంతో హౌస్ మేట్స్ చాలా వ‌ర‌కు కాజ‌ల్ బ‌య‌టికి ఎప్పుడు వెళుతుందా అని ఓపెన్ గానే చెప్పేయ‌డంతో కాజ‌ల్ జ‌ర్నీకి బిగ్‌బాస్ హౌస్ లో బ్రేక్ ప‌డింది. అన‌వ‌రంగా అరుస్తూ ఇంటి స‌భ్యుల‌కు చిరాకు తెప్పించిన ఆమె నోరే ఎలిమినేట్ అయ్యేలా చేసింది.

కాజ‌ల్ పారితోషికం ఎంతో తెలుసా?

ఇక మొద‌ట్లో ష‌ణ్ముఖ్ తో స‌న్నిహితంగా వున్న కాజ‌ల్ ఆ త‌రువాత త‌న స్టాండ్ ని మార్చుకుని మాన‌స్ తో ఫ్రెండ్షిప్ చేయ‌డం.. స‌న్నీకి ద‌గ్గ‌ర కావ‌డంతో నెటిజ‌న్ లు కాజ‌ల్ పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. మాన‌స్‌, స‌న్నీల‌తో కాజ‌ల్ కు ప్ర‌త్యేక‌మైన బంధం ఏర్ప‌డ‌టంతో ఒక్క‌సారిగా కాజ‌ల్ పై పాజిటివ్ వైబ్ మొద‌లైంది. ఓ ద‌శ‌లో స‌న్నీని టార్గెట్ చేసిన నాగార్జున‌నే ఎదిరిస్తూ స‌న్నీకి అండ‌గా నిలిచింది కాజ‌ల్‌. ఈ ఒక్క సంఘ‌ట‌న‌తో కాజ‌ల్ క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఆమెపై ప్రేక్ష‌కుల్లో పాజిటివ్ వైబ్ స్టార్ట‌యింది. కాజ‌ల్ కున్న క్లారిటీ.. గెలుపు పై వున్న విశ్వాసం అమెని ఇన్ని రోజులు హౌస్ లో కంటిన్యూ అయ్యేలా చేశాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.