English | Telugu

బిగ్ బాస్ : క‌ప్పు బ‌రాబ‌ర్ గెలుస్తా - స‌న్నీ

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5సోమ‌వారం సెంచ‌రీ కొట్టేసింది. షో మొద‌లై వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో హౌస్ లో వున్న ఐదుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలే ఎలా వుంటుంది? .. విన్న‌ర్ నేనే అవుతానంటూ ఆలోచ‌న‌ల్లో మునిగితేలుతున్నారు. హౌస్ లోవున్న టాప్ 5 కంటెస్టెంట్ ల‌లో స‌న్నీ, మాన‌స్‌, శ్రీ‌రామ‌చంద్ర‌, సిరి , ష‌ణ్ముఖ్ వున్నారు. ఈ ఐదుగురిలో ఒక్క‌రే టైటిల్ విన్న‌ర్‌గా నిల‌వ‌బోతున్నారు. అయితే అది ఎవ‌రు? అన్న‌దే ఇప్పుడు కంటెస్టెంట్‌ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది.

రీమేక్ కి ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్!

ఈ నేప‌థ్యంలో ఆల్ రౌండ‌ర్ గా పేరు తెచ్చుకున్న స‌న్నీ నే విన్న‌ర్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా వున్నాయంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఓట్ల ప‌రంగానూ స‌న్నీనే అంద‌రి కంటే ముందు వ‌రుస‌లో నిలుస్తున్నాడు. ఇదిలా వుంటే గ్రాండ్ ఫినాలే పై స‌న్నీ స్పందించాడు. గ్రాండ్ ఫినాలే ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో స‌న్నీ, మాన‌స్ దీని గురించి మాట్లాడుకున్నారు.

ఈ సంద‌ర్బంగా స‌న్నీ మాట్లాడుతూ ` టెన్ష‌న్ గా వుంది ఎలాగైనా టైటిల్ గెల‌వాలి. మా అమ్మ‌కు క‌ప్ ఇస్తరా బ‌య్.. ఇది ఫిక్స్‌.. ఏదైనా కానీ బరాబ‌ర్ క‌ప్పు ఇస్తా` అంటూ త‌న విజేత‌గా నిలుస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆ త‌రువాతే బిగ్‌బాస్ కంటెస్టెంట్ అ జ‌ర్నీని బిగ్ బాస్ వ‌న్ బై వ‌న్ చూపించ‌డం మొద‌లు పెట్టారు. మంగ‌ళ‌వారం స‌న్నీ జ‌ర్నీ చూపించే అవ‌కాశం వుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.