English | Telugu

'ఆహా' మరో ట్విస్ట్.. బన్నీ 'అన్ స్టాపబుల్'కి బ్రేక్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆరో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుండి ప్రసారం కానుందని ఇటీవల ఆహా ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది ఆహా.

నిజానికి ఆరో ఎపిసోడ్ గా మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని పాల్గొన్న ఎపిసోడ్ రానుందని మొదట ఆహా ప్రకటించింది. అయితే ఈ డిసెంబర్ 31 కి వాయిదా వేసి, ఆ ప్లేస్ లో బన్నీ ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'తో బన్నీ డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే బన్నీ ఎపిసోడ్ ని ముందుకి తీసుకొచ్చి రవితేజ ఎపిసోడ్ ని పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ వినిపించింది.

అయితే తాజాగా బన్నీ ఎపిసోడ్ ని కూడా పోస్ట్ పోన్ చేసి షాక్ ఇచ్చింది ఆహా. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప ఎపిసోడ్ ని కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు(డిసెంబర్ 25) విడుదల చేయలేకపోతున్నామని ఆహా తెలిపింది. కాస్త ఆలస్యమైనా బెస్ట్ అవుట్ పుట్ తో వస్తామని చెప్పింది. చిన్న బ్రేక్ అంతే, అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుంది అని ఆహా పేర్కొంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.