English | Telugu

బిగ్ బాస్ 6 అప్డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జునే కానీ?

తెలుగులో బిగ్ బాస్ షో ఐదు సీజన్లు పూర్తయ్యాయి. ఇటీవలే ఘనంగా ముగిసిన ఐదో సీజన్ లో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. అయితే మరో రెండు నెలల్లో బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ ప్రారంభం కానుందని బిగ్‏బాస్ 5 గ్రాండ్ ఫినాలే వేదికపై నాగార్జున అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున చెప్పినట్లుగానే బిగ్ బాస్ షో నెక్స్ట్ సీజన్ అప్డేట్ వచ్చింది. ఈసారి బిగ్ బాస్ షో ఓటీటీలో అలరించనుంది.

ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీలో ఒక సీజన్ పూర్తి చేసుకుంది. దీనికి కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా బిగ్ బాస్ ఓటీటీలో అలరించనుంది. బిగ్ బాస్ లైవ్.. ఓటీటీలో మొదటిసారిగా ప్రసారం కాబోతోంది. దీనికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ రోజంతా ఉన్నా అక్కడా జరిగే కొన్ని హైలైట్స్ ని మాత్రమే ఎడిట్ చేసి ఎపిసోడ్ గా ఆడియన్స్ కి చూపిస్తారు. అయితే ఓటీటీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ లైవ్ లో మాత్రం కంటెస్టెంట్స్ హౌస్ లో డే అంతా ఎలా ఉంటున్నారో చూపించనున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ లైవ్ తో పాటు పలు సిరీస్ లు, ఓటీటీ సినిమాలతో అలరించడానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్ధమవుతోంది. తెలుగులో రాబోతోన్న ఫస్ట్ ఒరిజినల్ హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ 'పరంపర'తో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర అలరించబోతన్నారు. క్రిష్ డైరెక్షన్‌లో తారక రత్న, అజయ్ కాంబినేషన్‌లో థ్రిల్లింగ్ బ్యాంక్ రాబరీ '9 అవర్స్' అనే చిత్రం రాబోతోంది. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో సైతాన్ అనే హారర్ సినిమా రెడీగా ఉంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.