English | Telugu

బిగ్‌బాస్ ఓటీటీ అత‌ని చేతికా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసింది. విజేత‌గా వీజే స‌న్నీ నిలిచిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ ముగిసిన వెంట‌నే ఓటీటీ లో బిగ్‌బాస్ అనే వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఓటీటీ బిగ్ బాస్ 24 గంట‌ల నిడివితో వుంటుంద‌ని, దాని ఫార్మాట్ వేరేగా వుంటుంద‌ని ఇటీవ‌ల బిగ్‌బాస్ హోస్ట్‌, హీరో నాగార్జున వెల్ల‌డించారు. అయితే దీనికి హోస్ట్ గా ఎవ‌రు వ్య‌వ‌హ‌రిస్తారు? .. ఏమా క‌థ‌... కంటెస్టెంట్ లు ఎలా వుంటారు? .. ఎలా ఎంపిక చేస్తారు? .. అన్న విష‌యాల‌పై మాత్రం ఇంత వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త‌లేదు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ ఓటీటీ ఓంకార్ చేతుల్లోకి వెళ్లిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read:అది విష‌పూరిత స‌ర్ప‌మే.. స‌ల్మాన్ వెల్ల‌డించిన షాకింగ్ డీటైల్స్‌!

అత‌నే ఓంకార్‌. OAK Entertainments పై ఆట‌, సిక్స్త్ సెన్స్‌, ఇస్మార్ట్ జోడీ, మాయాద్వీపం వంటి వినూత్న‌మైన కార్య‌క్ర‌మాల‌తో ఆక‌ట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌కి టీఆర్పీ రేటింగ్స్ కూడా రికార్డు స్థాయిలో న‌మోదు కావ‌డం విశేషం. దీంతో బిగ్‌బాస్ ఓటీటీ బాధ్య‌త‌ల్ని నిర్వాహ‌కులు ఓంకార్ కు అప్ప‌గించే అవ‌కాశం వుంద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ షో డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో బిగ్‌బాస్ ఓటీటీ షో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా బిగ్‌బాస్ కొత్త సీజ‌న్ కూడా మ‌రో రెండు నెల‌ల్లో అంటే ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కాబోతోంది.

Also Read:జెనీలియాతో స‌ల్మాన్ డాన్స్‌.. వీడియో వైర‌ల్‌!

ఇక ఓటీటీ బిగ్‌బాస్ కోసం ఎంపిక చేయ‌బోతున్న కంటెస్టెంట్స్ ఎవ‌రంటే వీరేనంటూ కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పేర్లు విన్న వాళ్లంతా అవాక్క‌వుతున్నారు. సీజ‌న్ 5 స‌మ‌యంలో ఉప్ప‌ల్ బాలు, క‌త్త‌ర్ పాప‌, యాంక‌ర్ శివ‌, బంజారాహిల్స్ ప్ర‌శాంత్‌, టిక్ టాక్ దుర్గారావు వంటి పేర్లు వినిపించాయి. అయితే వీరినే బిగ్‌బాస్ ఓటీటీకి సెలెక్ట్ చేయాల‌ని ఓంకార్ భావిస్తున్నార‌ని, ఇదేం విచిత్రం బాబోయ్ అని వీక్ష‌కులు అవాక్క‌వుతున్నారు. ఇదే నిజ‌మైతే ఓటీటీ బిగ్‌బాస్ ఓ అరాచ‌కంగా మార‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.