English | Telugu

అంతమంది సెలబ్రిటీస్ వచ్చినా 'బిగ్ బాస్ 5 ఫినాలే' రేటింగ్ తక్కువే!

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ డిసెంబర్ 19 న గ్రాండ్ గా ముగిసింది. ఐదో సీజర్ విన్నర్ గా వీజే సన్నీ నిలిచాడు. అయితే ఎంతో ఘనంగా జరిగిన బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేటింగ్ మునుపటి రికార్డులను తిరగ రాస్తూ భారీగా వస్తుందని భావించారంతా. కానీ గత సీజన్లతో పోల్చితే తక్కువ టీఆర్పీ నమోదు చేసి బిగ్ బాస్ ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేసింది.

బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ఎప్పుడు లేనంతగా భారీగా గెస్ట్ లు తరలివచ్చారు. రాజమౌళి, రణబీర్ కపూర్, ఆలియా భట్, నాని, నాగ చైతన్య, శ్రియ, ఫరియా అబ్దుల్లా ఇలా ఎందరో సందడి చేశారు. దీంతో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రికార్డు టీఆర్పీ వస్తుందని అనుకున్నారంతా. కానీ గత సీజన్ల టీఆర్పీతో పోల్చితే తగ్గింది. బిగ్ బాస్ మొదటి నాలుగు సీజన్ల టీఆర్పీ గమనిస్తే '14.13, 15.05, 18.29, 19.51' ఇలా ప్రతి సీజన్ కి పెరుగుతూ వచ్చింది. ఈ సారి గెస్ట్ లు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో గత రెండు సీజన్ల స్థాయిలో రేటింగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 16.04 కి పరిమితమైంది.

16 అనేది మంచి రేటింగే అయినప్పటికీ గత సీజన్లతో పోల్చితే తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి త్వరలో ఆరో సీజన్ ని ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి రికార్డు రేటింగ్ వచ్చేలా ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.