English | Telugu

సదాకి లిప్ లాక్ ఇచ్చిన నాటీ నరేష్!

నాటీ నరేష్'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'లో ప్రతీ స్కిట్ లో తనని తానూ మెరుగుపరుచుకుంటూ కొత్త కొత్త పంచ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ని కదలనివ్వకుండా చేస్తున్నాడు. ఇంటికి తాళం వేసినా వేయకపోయినా సెల్ కి తాళం వేయకపోతే కాపురాలు కూలిపోతాయనే కాన్సెప్ట్ తో కొత్త స్కిట్ ట్రై చేసాడు. ట్రాన్స్ఫార్మర్స్ మూవీలో కార్లు ఎలా మనుషుల్లా మాట్లాడతాయో ఈ స్కిట్ లో కూడా సెల్ ఫోన్, టీవీ అన్ని మాట్లాడతాయన్నమాట. ఇందులో సెల్ ఫోన్ వేషంలో నరేష్ వ‌స్తాడు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ స్కిట్ కి మంచి మార్క్స్ పడ్డాయి. ఎందుకంటే చాలా మంది ఇళ్లల్లో భర్తలు తమ సెల్స్ ని భార్యలు ఎక్కడ చూసేసి తమ సీక్రెట్స్ తెలుసుకుంటారో అని సెల్స్ ని కూడా తమతో పాటు బాత్ రూమ్ లోకి తీసుకెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇదే కాన్సెప్ట్ తో మంచి స్కిట్ రాసుకుని నాట్ బాడ్ అనిపించారు కెవ్వు కార్తీక్, నాటీ నరేష్. కార్తిక్ సెల్ పోవడంతో వెతుకుతూ ఉంటాడు. ఇంతలో నరేష్ సెల్ ఫోన్ వేషంలో వచ్చి కార్తిక్ ని చితక్కొడతాడు. స‌సెల్ ఫోన్ ఉన్నది మాట్లాడుకోవడానికి, మెసేజ్ చేసుకోవటానికి అన్నప్పుడు బాత్ రూమ్ లోకి తీసుకెళ్లడమేంట్రా.. ఆ బాత్రూమ్ వాసన నేను భరించాలా?స‌ అంటూ నాటీ నరేష్ అంటాడు. సీరియస్ గా 'ప్రపంచంలో ఉన్న అందరికీ వార్నింగ్ ఇస్తున్నా.. సెల్ కి లాక్ వేయండి. లేదంటే కాపురాలు మటాష్' అంటూ ఊగిపోతూ డైలాగ్ చెప్తాడు నరేష్.

'ఇంత కోపంలోనూ చాలా హ్యాపీ గా ఉన్నారేంటి' అంటాడు కార్తిక్. 'నేను ఎక్కువగా సదా గారి దగ్గర చాలా సంతోషంగా ఉంటాను' అంటాడు నరేష్. 'ఎందుకంటే ఆమె ఫోన్ మాట్లాడినప్పుడల్లా పండగే నాకు. ఎన్ని సార్లు ఆమె బుగ్గ మీద లిప్ లాక్స్ ఇచ్చానో' అంటూ సిగ్గుపడతాడు. ఇక రష్మీ విషయం ఏమిటని కార్తీక్ అడిగేసరికి 'రష్మీతో సెల్ఫీ దిగినప్పుడల్లా సెల్ ఫోన్ డెడ్ ఐపోతుంది' అంటూ నాటీ ఆన్సర్ ఇస్తాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.