English | Telugu

య‌ష్‌, మాళ‌విక‌ల‌కు షాకిచ్చిన ఖుషీ

బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల‌బంధం. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా `స్టార్ మా`లో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ అనూహ్య మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. కీల‌క పాత్ర‌ల్లో కొత్త న‌టీన‌టులు న‌టించిన ఈ సీరియ‌ల్ ఈ శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర మ‌లుపుకు శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. విడాకుల కోసం య‌ష్ అత‌ని మాజీ భార్య మాళ‌విక కోర్టుని ఆశ్ర‌యిస్తారు.

ఈ నేఫ‌థ్యంలో ఖుషీ కావాలంటే విడాకుల‌కు అంగీక‌రించాల‌ని య‌ష్‌కు మాళ‌విక ప్రియుడు అభిమ‌న్యు ష‌ర‌తు పెడ‌తాడు. త‌న పాప కోసం ఇష్టం లేక‌పోయినా విడాకుల‌కు ఓకే చెబుతాడు య‌ష్‌.. అయితే కోర్టులో త‌న‌కు విడాకులు ఇష్ట‌మేన‌ని య‌ష్ చెప్పిన త‌రువాత కోర్టు ఇద్ద‌రికి విడాకులు మంజూరు చేస్తుంది. అయితే ఇదే క్ర‌మంలో య‌ష్ ని పాప ఎవ‌రి వ‌ద్ద వుండాల‌ని భావిస్తున్నార‌ని న్యాయ‌మూర్తి అడుగుతారు. అయితే పాప త‌న‌కే కావాల‌ని య‌ష్ బ‌దులిస్తే అనూహ్యంగా మాళ‌విక కూడా త‌న‌కే పాప కావాలంటుంది.

Also Read: 'బాహుబ‌లి' భామ‌కు క‌రోనా!

ఊహించ‌ని షాక్ లో వున్న య‌ష్ ని చూసి అభిమ‌న్యు వెట‌కారంగా చూస్తూ గొర్రె క‌సాయివాడినే న‌మ్ముతుంది య‌శోధ‌ర్‌.. నేను త‌డి గుడ్డ‌తో గొంతులు కోసే ర‌కం.. అది తెలిసి న‌న్ను న‌మ్మ‌డం నీ అమాయ‌క‌త్వం అని త‌న చూపుల్తోనే చెప్పేస్తాడు. త‌నని మ‌రోసారి అభిమ‌న్యు మోసం చేశాడ‌ని ర‌గిలిపోతాడు య‌ష్‌. ఇంత‌లో జ‌డ్జి పాప ఎవ‌రి ద‌గ్గ‌ర వుండాలో పాప‌నే అడుగుదామ‌ని, పాప‌ని తీసుకురండ‌ని చెబుతుంది... కోర్టు హాలు లోకి ప్ర‌వేశించిన ఖుషీ త‌న‌కు డాక్ట‌ర్ వేద కావాల‌ని చెప్ప‌డంతో అంతా షాక్ అవుతారు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? .. క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.