English | Telugu

గ్రాండ్ ఫినాలే టీఆర్పీ ఇంతొచ్చిందా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లే ముగిసిన విష‌యం తెలిసిందే. గ‌త సీజ‌న్‌ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్ స‌ప్ప‌గా సాగింద‌ని విమ‌ర్శ‌లు వినిపించాయి. అయితే ఫైన‌ల్ గా ఈ సీజ‌న్ గ్రాండ్ ఫినాలేలో స‌న్నీ విజేత‌గా నిలిచి దాదాపు కోటి రూపాయ‌ల ప్రై స‌న్నీద‌క్కించుకున్నాడు. 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీతో పాటు 25 ల‌క్ష‌ల విలువ చేసే ఇంటి స్థ‌లం.. 15 వారాల రెమ్యున‌రేష‌న్ వెరసి వీజే స‌న్నీకి కోటికి మించి అందిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సీజ‌న్‌కి సంబంధించిన తాజ‌గా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త చక్క‌ర్లు కొడుతోంది.

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన ఈ షో గ్రాండ్ ఫినాలే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంద‌ని తెలుస్తోంది. సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలే గ‌త సీజన్ ల‌కు పూర్తి భిన్నంగా సాగింది. గ్రాండ్ ఫినాలే రోజు హౌస్ లో మొత్తం ఐదుగురు స‌భ్యులున్నారు. స‌న్నీ, ష‌ణ్ముఖ్, మాన‌స్‌, శ్రీ‌రామ్, సిరి. ఈ ఐదుగురిలో సిరి ఎలిమినేట్ కావ‌డం తెలిసిందే. ఆ త‌రువాత మాన‌స్‌, శ్రీ‌రామ్ ఎలిమినేట్ అవుతూ వ‌చ్చారు. చివ‌రికి స‌న్నీ, ష‌ణ్ముఖ్ ఇద్ద‌రు మాత్ర‌మే ఫైన‌ల్ కు చేరుకున్నారు.

ఫైన‌ల్ గా వీజే స‌న్నీ విజేత‌గా నిలిచాడు. అయితే ఆరోజు జ‌రిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కి ప్ర‌ధానంగా ఛీఫ్ గెస్ట్ అంటూ ఎవ‌రూ హాజ‌రు కాక‌పోయినా షోకు భారీ స్థాయిలో టీఆర్పీరేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. ఈ షోలో అతిథులుగా రాజ‌మౌళి, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అలియా భ‌ట్ పాల్గొని సంద‌డి చేశారు. నాగ‌చైత‌న్య‌, నాని, సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి తో పాటు హౌస్‌లోకి రాగా.. మ‌రి కొంత మంది త‌మ డ్యాన్సుల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ఈ షో టాప్ హిట్ గా నిలిచింది. టీఆర్పీ రేటింగ్ 18.4గా న‌మోదైంద‌ని, ఈ షో గ్రాండ్ ఫినాలేని 6.2 కోట్ల మంది వీక్షించార‌ని, 4. 5 గంట‌ల పాటు షో సాగింద‌ని `స్టార్ మా` సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.