English | Telugu

అప్పుడే స‌గం చ‌చ్చిపోయా : సాయి కిర‌ణ్‌

త‌రుణ్ హీరోగా ప‌రిచ‌యం అయిన చిత్రం `నువ్వే కావాలి`. ఇదే సినిమాతో సెకండ్ హీరోగా ప‌రిచ‌యం అయ్యారు సాయికిర‌ణ్‌. కానీ హీరోగా మాత్రం రాణించ‌లేక‌పోయారు. 25కు పైగా చిత్రాల్లో హీరోగా న‌టించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో సాయికిర‌ణ్ గ‌త కొంత కాలంగా బుల్లితెర‌పై రాణిస్తున్నారు. తండ్రి పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీగా మారిపోయారు. కోయిల‌మ్మ‌.., ఇంటి గుట్టు... గుప్పెడంత మ‌న‌సు వంటి ధారావాహిక‌ల్లో న‌టిస్తున్నారాయ‌న‌.

ఇంటి గుట్టులో తండ్రిగా న‌టిస్తున్న సాయి కిర‌ణ్ అదే త‌ర‌హా తండ్రి పాత్ర‌ని `గుప్పెడంత మ‌న‌సు`లో న‌టిస్తున్నా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఈ మూడు సీరియ‌ల్స్‌ల‌లో ఇంటి గుట్టు, గుప్పెడంత మ‌న‌సు మంచి రేటింగ్‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్త్యూలో సాయికిర‌ణ్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. త‌న‌కు బుల్లితెర‌పై గుర్తింపుని తెచ్చిన `కోయిల‌మ్మ‌` సీరియ‌ల్‌ని అర్థాంత‌రంగా ఆపేయ‌డంతో స‌గం చ‌చ్చిపోయాన‌న్నారు.

ఈ సీరియ‌ల్‌లో సింగ‌ర్ మ‌నోజ్ కుమార్‌గా న‌టించా. అది నా మ‌న‌సుకు చాలా ద‌గ్గ‌రైన పాత్ర‌. ఇదే సీరియ‌ల్‌ని మ‌ల‌యాళంలోనూ ఏక కాలంలో చేశా. కానీ రెండు భాష‌ల్లోనూ ఈ సీరియ‌ల్‌ని ఒకేసారి ఆపేయ‌డంతో స‌గం చ‌చ్చిపోయా ` అన్నారు సాయి కిర‌ణ్‌. త‌న కెరీర్‌లో `కోయిల‌మ్మ` సీరియ‌ల్ పెద్ద మైలు రాయిగా నిలిచింద‌ని అలాంటి సీరియ‌ల్‌ని మ‌ధ్య‌లోనే ఆపేయ‌డంతో త‌ట్టుకోలేక‌పోయాన‌న్నారు సాయికిర‌ణ్‌

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.