English | Telugu

Karthika Deepam2 :  సుమిత్ర కోసం జ్యోత్స్న పెళ్ళికి రెడీ.. మరి సీఊఓ ఎవరు!


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -509 లో.. జ్యోత్స్న పట్ల సుమిత్ర తన నిర్ణయం చెప్తుంది. నా కూతురిని నేను పెళ్లి కూతురిగా చూడాలని అనుకుంటున్నానని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అత్త భలే ట్విస్ట్ ఇచ్చిందని దీపతో కార్తీక్ చెప్తాడు. ఒకసారి సీఈఓ గురించి ఆలోచించండి అని శివన్నారాయణతో పారిజాతం అనగానే.. ఆలోచిస్తాను., ఇప్పుడు కాదు బోర్డు మీటింగ్ లో అని శివన్నారాయణ అంటాడు.

ఆ తర్వాత ఇలా చేస్తే పని అవనప్పుడు శత్రువు దగ్గరికి వెళ్లి కాకా పట్టాలని పారిజాతం అంటుంది. దాంతో కిచెన్ లో ఉన్న దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్లి.. నువ్వు నాకొక హెల్ప్ చెయ్యాలి.. సీఈఓగా నాకు సపోర్ట్ చెయ్యమని బావకి నువ్వు చెప్పాలి.. అలా చేస్తే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. అయినా మా బావ నా మాటేందుకు వింటాడని దీప అంటుంది. అలా అనకు దీప నాకు ఎవరు సపోర్ట్ లేరని జ్యోత్స్న ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ప్లీజ్ ఈ ఒక్కసారి హెల్ప్ చెయ్ అని చెప్పి వెళ్తుంది.

ఆ తర్వాత అందరు బోర్డు మీటింగ్ కి వెళ్తారు. బావ నీతో మాట్లాడాలి అని జ్యోత్స్న బయటే కార్తీక్ ని ఆపుతుంది. నాకూ హెల్ప్ చెయ్యాలని అడుగుతుంది. నువ్వు నా భార్యతో బేరం మాట్లాడడం చూసానని కార్తీక్ అంటాడు.‌సపోర్ట్ చెయ్యనని కార్తీక్ చెప్తాడు. కోపంగా జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. బోర్డు మీటింగ్ లో అందరూ జ్యోత్స్న సీఈఓగా వద్దని చెప్తారు. నేను మీ నిర్ణయం అంగీకరిస్తున్నాను కానీ కొత్త సీఈఓ ఎవరని జ్యోత్స్న అడుగుతుంది. కార్తీక్ ని శివన్నారాయణ పిలుస్తాడు. నో డౌట్ కచ్చితంగా బావనే సీఈఓ చేస్తారు ఎలాగైనా దీన్ని ఆపాలని జ్యోత్స్న అనుకుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.