English | Telugu

Illu illalu pillalu : నర్మద జాబ్ పోయేలా చేసిన భద్రవతి.. ప్రేమ వెళ్ళిపోయిందిగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -310 లో...... నర్మద ఆఫీస్ కి వెళ్తూ వేదవతి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది కానీ వేదవతి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అత్తయ్య నేను ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు నాతో నవ్వుతూ మాట్లాడాలి లేదంటే నాకు మంచి జరగదని నర్మద అంటుంది అయినా సైలెంట్ గా వేదవతి ఉంటుంది. అర్ధం అయింది నేను మీ వాళ్లకి ఎదురువెళ్తున్నానని కోపంగా ఉంది కదా.. నా డ్యూటీ నేను చేసానని నర్మద చెప్పి వెళ్ళిపోతుంది. కోపం కాదు బాధ మా వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారని భయంగా ఉందని వేదవతి అనుకుటుంది.

మరొకవైపు నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. ఒకతను బయట ఫోన్ మాట్లాడి లోపలికి నర్మద దగ్గరికి వెళ్లి ఫైల్ ఇస్తాడు. అందులో డబ్బు ఉంటుంది. ఏంటి ఇది అని నర్మద అడుగుతుంది. ఆ లోపే మీడియా పోలీసులు అధికారులు అందరు వస్తారు. నన్ను లంచం అడిగింది అని సేనాపతి మనిషి చెప్పగానే నర్మదని సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత టీవీ లో ఆ న్యూస్ వస్తుంది. అది శ్రీవల్లి చూసి ఇంట్లో అందరిని పిలిచి చెప్తుంది. అదంతా చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. రామరాజు కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కల్వదు. మరొక వైపు శ్రీవల్లి ఇంకా తన పేరెంట్స్ ఇద్దరు బయటకి వెళ్లి నర్మద జాబ్ పోయిందని డ్యాన్స్ చేస్తారు.

ఆ తర్వాత సేనాపతి, భద్రవతి న్యూస్ లో అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి ఎదురు వస్తుందా అని మాట్లాడుకుంటారు. అప్పుడే నర్మద ఇంటికి వస్తుంది. తనని చూసి భద్రవతి, సేనాపతి ఇద్దరు నవ్వుకుంటాడు. ఇంత అవినీతిగా పని చేస్తావా అని నర్మదకి కోపం వచ్చేలా మాట్లాడుతారు. తరువాయి భాగంలో మీ వాళ్ళు మా వదిన జాబ్ పోయేల చేశారని ప్రేమతో ధీరజ్ అంటాడు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను.. ఇంకెప్పుడు రానని ప్రేమ అంటుంది.. వెళ్ళు అని ధీరజ్ కోపంగా అనగానే నిజంగానే ప్రేమ తన పుట్టింటికి వెళ్తుంది. అదంతా భాగ్యం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.