English | Telugu

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కు ఊహించ‌ని స్టార్స్

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ క్లైమాక్స్ కి చేరింది. మ‌రో ఐదు రోజుల్లో ముగియ‌బోతోంది. ఈ నేప‌థ్యంలో గ్రాండ్ ఫినాలే ఎలా వుండ‌బోతోంది.. భారీ స్థాయ‌లో జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్ కు గెస్ట్ లుగా ఎవ‌రెవ‌రు రాబోతున్నారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది. గ‌త కొన్ని వారాలుగా ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతూ వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతోంది. కాజ‌ల్ ఎలిమినేష‌న్ తో హౌస్ లో మొత్తం 5 గురు కంటెస్టెంట్ లు మిగిలారు.

4 గంట‌లు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డ్డ‌ వ‌నిత‌.. ఎందుకో తెలుసా?

టాప్ 5 కంటెస్టెంట్ లు మిగిలారు. ఇక ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడొక‌లెక్క అన్న‌ట్టుగా హౌస్ వాతావ‌ర‌ణం మారింది. టాప్ 5 కి చేరిన కంటెస్టెంట్ ల‌లో ఆదివారం జ‌రిగే గ్రాండ్ ఫినాలేలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే గ్రాండ్ ఫినాలేకి ఈ సారి భారీ స్థాయిలో ఊహించ‌ని గెస్ట్ లు, స్టార్ లు రానున్నార‌ని తెలుస్తోంది.

డిసెంబ‌ర్ 19న జ‌రగ‌నున్న గ్రాండ్ ఫినాలేను నెవ‌ర్ బిఫోర్ అనే రేంజ్‌లో నిర్వ‌హించాల‌ని నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేకు `ఆర్ ఆర్ ఆర్` టీమ్ గెస్ట్ లుగా వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే బాలీవుడ్ క్రేజీ స్టార్ ల‌ని ఈ ఈవెంట్ కి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ్ వీర్ సింగ్, దీపికా ప‌దుకోన్ ల‌తో పాటు అలియాభ‌ట్ కూడా పాల్గొననుంద‌ని , ఇందు కోసం మేక‌ర్స్ సంప్ర‌దింపులు జరుపుతున్నార‌ని తెలిసింది. ఇదే నిజ‌మైతే గ్రాండ్ ఫినాలే మ‌రింత గ్రాండ్ గా వెలిగిపోవ‌డం ఖాయం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.