English | Telugu

Brahmamudi : భర్తపై రివెంజ్ తీసుకున్న భార్య.. ఆ ఇద్దరు ఎలా ఉన్నారంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -493 లో.....కళ్యాణ్ ఇంటికి రాగానే అప్పు భోజనం వడ్డీస్తుంది. అది తిని బాగుందని కళ్యాణ్ చెప్తాడు. ఏంటి బాగుందా అని అప్పు తింటుంది. అది తిని ఇది బాగుంది అంటావేంటని అప్పు అంటుంది. అంటే ఎక్కడ బాలేదంటే ఇవన్నీ ఎత్తేస్తావేమోనని కళ్యాణ్ అంటాడు. అంటే నేను కోపిష్టి దాన్ని అంటున్నావా అని అప్పు అంటుంది. అ తర్వాత రెండు రోజుల్లో వంట నేర్చుకుంటా అని అప్పు అంటుంది.

నా దగ్గరున్నా ఆరు వేలల్లో మూడు వేలతో సరుకులు కొనుకొస్తానని కళ్యాణ్ అంటాడు. ఇక నుండి ఇలా మనం పిలుచుకోవద్దు. నేను నిన్ను పొట్టి అని పిలుస్తానని కళ్యాణ్ అనగా... నిన్ను కూచి అంటానని అప్పు అంటుంది. ఆ తర్వాత బంటి ఆకలి అంటూ కనకం దగ్గరికి వస్తాడు. అక్కడ ఉందంటూ కనకం చిరాకు పడుతుంటే.. అప్పు, కళ్యాణ్ లని నేనే నా రూమ్ లో ఉండమని చెప్పాను. వాళ్లు అక్కడే ఉన్నారని చెప్పగానే కనకం, కృష్ణమూర్తిలు హ్యాపీగా ఫీల్ అవుతారు.అ తర్వాత రాజ్ కి కావ్య కాఫీ తీసుకొని వచ్చి.. కాఫీ కీ డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. రాత్రి ఏమన్నారు ఆస్తుల కోసం కళ్యాణ్ ని రావద్దని అనుకుంటున్నానని అన్నారు కదా.. మీరు ఏం రాసిచ్చారు.. అందుకే నేను చేసే పనికి ఇక నుండి వెల కడుతానని కావ్య అంటుంది. ఏంటి రివెంజ్ ఆ అని రాజ్ అంటాడు. కావ్య వెళ్లిపోతుంటే నీకు కావలిసింది డబ్బులు కదా ఇస్తానంటూ వంద రూపాయలు ఇచ్చి.. కావ్య తెచ్చిన టీ తాగుతాడు.

మరొకవైపు అప్పుకి కళ్యాణ్ బట్టలు కొనుకుని వస్తాడు. మిగతా మూడు వేలు ఇవ్వు వాటితో సరుకులు తెస్తానని కళ్యాణ్ అనగానే.. మిగతా మూడు వేలతో నేను నీకు బట్టలు తీసుకున్నా అని అప్పు అంటుంది. మరొకవైపు రాజ్ కిందకి వస్తుంటాడు. అప్పుడే ఇందిరాదేవి కాఫీ తీసుకొని రమ్మని అంటుంది. దానికి డబ్బులు కావాలనగానే కావ్యని వచ్చి రాజ్ ఆపుతాడు. అప్పుడే అపర్ణ వచ్చి టీ కావాలి అనగానే.. తనతో కూడ కావ్య అలాగే అంటుంది. ఎక్కడ రాత్రి అన్న మాటలు కావ్య చెప్తుందో కావ్యని బయటకు తీసుకొని వెళ్లి.. నువ్వు ఎదో సరదాగా అంటున్నావనుకున్న అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో ఇంట్లో పూజ చెయ్యాలని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు ఆ అప్పు ఇంటికి వచ్చాక అది ఈ ఇంటికి కరెక్ట్ కోడలు కాదని తెలిసేలా చేస్తానని రుద్రాణితో ధాన్యలక్ష్మి అంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.