English | Telugu

Bigg Boss 9 Double Elimination: డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్.. ఈ వారం దివ్య, సంజన అవుట్!

బిగ్ బాస్ సీజన్-9 ముగింపుకి వచ్చేసింది. పన్నెండో వారం కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ డీమాన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ పడాల మధ్య జరుగగా.. పవన్ కళ్యాణ్ గెలిచి చివరి ఇంటి కెప్టెన్ అయ్యాడు.

ఇక నామినేషన్లో కెప్టెన్ రీతూ తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు. ‌సోమవారం అర్థరాత్రి నుండి శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన ఓటింగ్ లో ఎవరికి ఎంత ఓటింగ్ పడిందో ఓసారి చూసేద్దాం. సోషల్ మీడియా చెబుతున్న లెక్కల ప్రకారం, పవన్ కళ్యాణ్ పడాల 32.66 శాతం ఓటింగ్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. 26.99 శాతం ఓటింగ్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. 9.14 శాతం ఓటింగ్ తో ఇమ్మాన్యుయల్ మూడో స్థానంలో ఉన్నాడు. 6.56 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 6.44 శాతం ఓటింగ్ తో భరణి ఐదో స్థానంలో ఉన్నాడు. 6.39 శాతం ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక సంజనా గల్రానీ, దివ్య నిఖిత డేంజర్ జోన్ లో ఉన్నారు.

Also Read: ప్రభాస్, అనుష్క పెళ్ళి.. వైరల్ గా మారిన వీడియో!

సంజనా గల్రానీ , దివ్య నిఖిత ఇద్దరిలో దివ్య నిఖిత ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతవారం కూడా తనే ఎలిమినేట్ అయ్యేది కానీ పవరస్త్ర వాడటం వల్ల తను సేవ్ అయ్యింది. ఈ వారం తనకే తక్కువగా ఓటింగ్ పడింది. ఒకవేళ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే సంజనా గల్రానీ, దివ్య నిఖిత ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య కన్ఫమ్ ఎలిమినేట్ అవుతుంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.