English | Telugu

Jayam serial : రిసెప్షన్ లో గంగకి అవమానం.. రుద్ర సూపర్ సపోర్ట్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -127 లో......రుద్ర గంగ పెళ్లి విషయం ఎవరికీ తెలియదు అని పెద్దసారు రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తాడు. రిసెప్షన్ కి పారు వస్తుంది తనని ఎవరు పిలిచారని శకుంతలని పెద్దసారు అడుగుతాడు. నేనే పిలిచానని శకుంతల అంటుంది. అలా ఎందుకు పిలిచావ్ అమ్మ అందరు ఏమనుకుంటారు.. తనతో పెళ్లి ఆగిపోయిందని ప్రీతీ అంటుంది. అనుకునే వాళ్ళు ఎలాగైనా అనుకుంటారని శకుంతల అంటుంది. ఆ తర్వాత రుద్ర రెడీ అయి కిందకి వస్తాడు.

ఆ తర్వాత రిసెప్షన్ కి పైడిరాజు, లక్ష్మీ వస్తుంటే సెక్యూరిటీ ఆపుతారు. దాంతో పెద్దసారు వెళ్లి వాళ్ళు మా వియ్యంకులు అని చెప్పి లోపలికి తీసుకొని వస్తాడు. పెళ్లి కూతురు వాళ్ళు బస్తీ వాళ్ళా అని వచ్చినవాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత రుద్ర వాళ్ళని కూర్చోమని చెప్తాడు. రుద్ర నువ్వు డౌన్ టు ఎర్త్ అని తెలుసు కానీ మరి ఇంత డౌన్ అయి పెళ్లి చేసుకుంటావ్ అనుకోలేదని పారు అంటుంది. ఆ తర్వాత గంగ ఓవర్ మేకప్ తో ఎంట్రీ ఇస్తుంది. అలా లేకి దానిలాగ తయారు అయ్యింది ఏంటి.. గొప్పింటి కోడలు అయ్యాను అని పొగరని వచ్చినా వాళ్ళు అనుకుంటారు. ఏంటి ఇలా రెడీ అయ్యావని ప్రీతీ అడుగుతుంది. ఆవిడా రెడీ చేసిందని గంగ అంటుంది. స్నేహ బ్యూటీషియన్ దగ్గరికి వెళ్తుంది కానీ తను ఉండదు.. అదంతా ఇషిక ప్లాన్ అందరు గంగని చూసి నవ్వుకుంటారు.

దాంతో గంగని రుద్ర తీసుకొని పైకి వెళ్తాడు. వెళ్లి చీర కట్టుకొని రా అంటాడు. గంగ చీర చుట్టుకొని వస్తుంది. నాకు కట్టుకోవడం రాదని చెప్పడంతో గంగకి రుద్ర చీర కడుతాడు. అందంగా రెడీ చేసి తీసుకొని వస్తాడు. దాంతో పారు, ఇషిక షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.