English | Telugu

'రౌడీ జనార్దన్‌' ప్రోమో.. అందరికీ చెప్పాల్సిన కథ ఇది!

Publish Date:Dec 18, 2025

  విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మిస్తున్న క్రేజీ మూవీ SVC59. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను డిసెంబర్ 22న సాయంత్రం 7.29 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.    ఈ విషయాన్ని తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తన మదిలో రూపుదిద్దుకున్న హీరో పాత్రను పరిచయం చేశారు డైరెక్టర్ రవికిరణ్ కోలా. "ఎప్పటినుంచో ఈ కథ చెప్పాలనుకుంటున్నా.. ఒక మనిషి గురించి. నా జ్ఞాపకాల్లో అతను ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూ పెరిగా. అతన్ని ఎంత ద్వేషించానో.. అంతకంటే ఎక్కువ ప్రేమించాను. అతనిది అందరికీ చెప్పాల్సిన కథ. మీకు కూడా అతన్ని పరిచయం చేస్తాను" అంటూ రిలీజ్ చేసిన డైరెక్టర్స్ నోట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. రక్తం కారుతున్న హీరో విజయ్ దేవరకొండ హ్యాండ్ చూపిస్తూ ఈ ప్రోమోను ముగించడం ఆసక్తి కలిగిస్తోంది. (Rowdy Janardhan)   కాగా, ఈ సినిమాకి 'రౌడీ జనార్దన్‌' అనే టైటిల్ ఖరారు చేసినట్లు గతంలో దిల్ రాజు తెలిపారు. డిసెంబర్ 22న ఆ టైటిల్ ని అఫీషియల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.    'రౌడీ జనార్దన్‌'పై మొదటి నుంచి ప్రేక్షకుల దృష్టి ఉంది. తాజాగా విడుదలైన డైరెక్టర్స్ నోట్ ప్రోమో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది అనడంలో సందేహం లేదు.   https://x.com/Theteluguone/status/2001614716649832739?s=20  

Can Chiranjeevi deliver big Sankranti hit with MSG?

Publish Date:Dec 18, 2025

Megastar Chiranjeevi after a blockbuster like Waltair Veerayya for Sankranti 2023, faced huge disasters with Godfather and Bhola Shankar. Now, he wants to register another big blockbuster for Sankranti 2026. Hit Machine Anil Ravipudi is directing the film and hence, the anticipation is huge from the film.  The movie team in typical director Anil Ravipudi style, have started releasing promotional material every week to keep the buzz growing. While Meesala Pilla and Sasirekha songs have become huge hits, in terms of views, the trolls regarding the song have been major too.  Now, the team has released BTS video with the entire team in a jovial fashion enjoying each scene. Nayanthara is seen enjoying her scenes while Chiranjeevi is serious with younger lot but highly focused with Ravipudi. His comic timing in this entertainer will be next level promised the director and makers.  Victory Venkatesh is playing an extended cameo. Akhanda 2 released with huge expectations but it did not live up to it. Can Chiranjeevi change this and deliver a blockbuster that is anticipated from him? We have to wait and see on 12th January 2026. Sahu Garapati and Sushmita Konidela are producing the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

సూర్యకాంతం మరణం.. పట్టించుకోని టాలీవుడ్‌ ప్రముఖులు.. ఎందుకని?

Publish Date:Dec 18, 2025

(డిసెంబర్‌ 18 నటి సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..) కొందరు నటీనటులు కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా రకరకాల క్యారెక్టర్స్‌ చేసేందుకు ఇష్టపడతారు. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే అలా చేస్తే రొటీన్‌ అయిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఒకే తరహా పాత్రను మళ్లీ మళ్లీ చేసి మెప్పించడం సూర్యకాంతం వల్లే సాధ్యమైంది. గయ్యాళి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సూర్యకాంతం.. 200 సినిమాల్లో ఆ పాత్రను పోషించి ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా చెయ్యగలిగారు.   సాధారణంగా సినిమాల్లో గయ్యాళి పాత్ర రాగానే ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు కోపం వస్తుంది. అయితే సూర్యకాంతం చేసే పాత్రలపై వారికి కోపం ఉంటూనే జాలి కూడా కలుగుతుంది. అలా ఆ పాత్రను సూర్యకాంతం తనదైన శైలిలో పోషించి మెప్పించారు. ఆమె చేసిన పాత్రల ప్రభావం ఎంతలా ఉండేదంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం కూడా మానేసే అంతగా. అంతకుముందు సూర్యకాంతం పేరు చాలా మందికి ఉండేది. ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారెవరూ తమ పిల్లలకు ఆ పేరు పెట్టే సాహసం చెయ్యలేదు.    సినిమాల్లో అంత గయ్యాళిగా కనిపించే సూర్యకాంతం ప్రవర్తన నిజజీవితంలో దానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఎంతో సౌమ్యం, మరెందో దయ, దానగుణంతో అందరికీ ప్రేమను పంచేవారు. అప్పటి హీరోలకు, మిగతా నటీనటులకు సూర్యకాంతం అంటే ఎంతో అభిమానం. ఆమె షూటింగ్‌లో ఉన్నారంటే యూనిట్‌ సభ్యులకు పండగే. ఎందుకంటే.. తను షూటింగ్‌కి వచ్చేటప్పుడు 20 మందికి సరిపడా భోజనాలు, పిండి వంటలు ఆమె వెంట వచ్చేవి. అందరితో కలిసి కూర్చొని ఆమె భోజనం చేసేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు.    సినిమాల ద్వారానే కాకుండా రకరకాల వ్యాపారాలు కూడా చేసి డబ్బు సంపాదించేవారు సూర్యకాంతం. అప్పట్లోనే పాత కార్లను కొని వాటికి మరమ్మతులు చేయించి తిరిగి అమ్మే వ్యాపారం చేసేవారు. నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఎలర్జీ వస్తోందని గ్రహించిన ఆమె.. విదేశాల నుంచి మేకప్‌ కిట్స్‌ తెప్పించి, వాటిని హీరోయిన్లకు అమ్మేవారు. ఇవి కాకుండా ఫైనాన్స్‌ కూడా చేసేవారు. ఎంతో మంది నిర్మాతలు తమ సినిమాల కోసం సూర్యకాంతం దగ్గర ఫైనాన్స్‌ తీసుకునేవారు. ఇక బాపు, రమణ చేసిన సినిమాలన్నింటికీ ఆమే ఫైనాన్సియర్‌. అది కూడా ఎంతో న్యాయబద్ధంగా చేసేవారు. దానికి ఉదాహరణగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.   ఒక సినిమాకి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ ఆమె దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. దాన్ని నెలనెలా చెల్లించేవారు. అలా ఒక నెల తమ మేనేజర్‌తో డబ్బు పంపించారు రమణ. అయితే ఆమె ఆ డబ్బు తీసుకోలేదు. అంతకుముందు నెలతోనే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అయిపోయాయని చెప్పారు. వడ్డీ ఎక్కువ చెబితే ఆ భయంతో డబ్బు  కరెక్ట్‌గా కడతారని భావించి డబ్బు ఇచ్చే ముందు ఎక్కువ వడ్డీ చెప్పానని, దానికి సాధారణ వడ్డీ మాత్రమే వేశానని అన్నారు. అలా లెక్కేస్తే మిగిలిన డబ్బు చెల్లించక్కర్లేదు అని చెప్పి ఆ డబ్బును వెనక్కి పంపించేశారు సూర్యకాంతం.   తన చివరి శ్వాస వరకూ నటించాలనుకునేవారు సూర్యకాంతం. ఆమె నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఎస్‌.పి.పరశురాం. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అదే సంవత్సరం డిసెంబర్‌ 18న తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చెన్నయ్‌లో జరుగుతున్న ఫారిన్‌ డెలిగేట్స్‌తో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకొని ఆ మీటింగ్‌ను గంటపాటు వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి ఆమెకు నివాళులర్పించి తిరిగి వెళ్లి మీటింగ్‌ను కొనసాగించారు. ఒక నటి కోసం ఎంతో ముఖ్యమైన ఆ మీటింగ్‌ నుంచి ఒక ముఖ్యమంత్రి హడావిడిగా వెళ్ళిపోవడం ఆమె పి.ఎ.కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినపుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్‌ అయ్యారు.   ‘షూటింగ్‌లో ఎంతో మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సూర్యకాంతంగారు. ఆమె పెట్టిన భోజనం ఎన్నోసార్లు తిన్నాను. కొన్నిసార్లు ఆమె ఏ షూటింగ్‌లో ఉందో తెలుసుకొని లంచ్‌ టైమ్‌కి అక్కడికి వెళ్లేదాన్ని. ఆమె వంటలంటే నాకు అంత ఇష్టం. ఆమె చేతి వంట తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఈ మీటింగ్‌ కంటే సూర్యకాంతంగారిని కడసారి చూసి నివాళులు అర్పించడమే నాకు ముఖ్యం’ అన్నారు జయలలిత.   ఇదిలా ఉంటే.. సూర్యకాంతం మరణ వార్త తెలిసిన వెంటనే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆమె నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కానీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో నామమాత్రంగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వంటి వారు హాజరు కాలేదు. అర్థరాత్రి చనిపోయారు కాబట్టి మరుసటి రోజు అందరూ వస్తారని మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించారు. ఒక మహానటికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.    సూర్యకాంతం చనిపోవడానికి ఆరు నెలల ముందు ప్రముఖ దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దానిలో చాలా తక్కువ శాతం మంది సూర్యకాంతం చనిపోయినపుడు ఆమెను చూసేందుకు వెళ్లారు. సూర్యకాంతం అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నటీమణి. ఆమె జీవించి ఉన్నప్పుడు ఎంతో మంది ఆమె నుంచి సాయం అందుకున్నారు. మరెంతో మందికి అన్నపూర్ణలా ఆమె అన్నం పెట్టారు. కానీ, ఆమె చనిపోయిన తర్వాత వీడ్కోలు పలికేందుకు మాత్రం మనుషులు కరువయ్యారు. 

Dhurandhar OTT: కళ్ళు చెదిరేలా 'ధురంధర్' ఓటీటీ డీల్.. పుష్ప-2 రికార్డ్ అవుట్!

Publish Date:Dec 18, 2025

  బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డీల్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   'ధురంధర్' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. గతంలో 'ధురంధర్' ఓటీటీ రైట్స్ రూ.130 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్ల డీల్ తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ వార్త నిజమైతే.. ఇండియన్ సినీ హిస్టరీలో ఇదే బిగ్ ఓటీటీ డీల్ అవుతుంది. గతంలో 'పుష్ప-2' రైట్స్ ని రూ.275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డుని 'ధురంధర్' బ్రేక్ చేసినట్లు అయింది. (Dhurandhar OTT)   ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే 'ధురంధర్' స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశముంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.   Also Read: తెలుగునాట అవతార్-3 ప్రభావం.. వంద కోట్లు కష్టమేనా..?   కాగా, 'ధురంధర్'కి సీక్వెల్ కూడా ఉంది. రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది. మరి ఈ రెండు భాగాలకు కలిపి ఓటీటీ డీల్ జరిగిందా? లేక ఒక్క భాగానికే రూ.285 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధపడిందా? అనేది తెలియాల్సి ఉంది.  

Divya Velamuri: పవన్ కళ్యాణ్ టాటూలు పర్మినెంట్‌గా  వేసుకోవద్దు..

Publish Date:Dec 18, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో కామన్ కేటగిరీలో వచ్చిన కంటెస్టెంట్స్ కి యమక్రేజ్ ఉంది. దానికి కారణం పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, దివ్య వేలమూరి, దమ్ము శ్రీజ, హరిత హరీష్, ప్రియా శెట్టి లాంటి వాళ్లు. వీళ్ళంతా హౌస్ లో ఉన్నన్ని రోజులు తమ సత్తా చాటారు. పన్నెండో వారం దివ్య ఎలిమినేట్ అయ్యింది. అయితే తన ఎలిమినేషన్ కార‌ణం సుమన్ శెట్టి, సంజన. ఓటింగ్ లో సుమన్ శెట్టి, సంజన లీస్ట్ లో ఉంటే దివ్యని ఎలిమినేట్ చేశారు. ఇది కంప్లీట్ గా అన్ ఫెయిర్.. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక డీమాన్ పవన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా పోస్ట్ లు చేస్తోంది దివ్య. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ‌ వీడియోని షేర్ చేసింది దివ్య. ఓ అభిమాని పవన్ కళ్యాణ్ పడాల పేరుని చేతిపై పచ్చబొట్టు (టాటు) వేయించుకున్నాడు. అది చూసి అన్ ఫెయిర్ ఇది.. కరెక్ట్ కాదని దివ్య అంది. బిగ్ బాస్ అనేది ఒక షో.. మరో నాలుగు రోజుల్లో ముగుస్తుంది. టెంపరరీ టాటూస్, మీ సిటీలో ప్రచారం చేసుకోవడం అనేది ప్రాపర్ గా ఉంటుంది కానీ‌ ఇలా పర్మినెంట్ టాటూస్ ని బాడీపై వేయించుకోవడం కరెక్ట్ కాదు.. ఇలా చేసేదేదో మీ కన్నవాళ్ళకోసమో , మీ లైఫ్ పార్టనర్ కోసమో చేస్తే బాగుంటుంది. అంతే కానీ ఒక టీవీ షో లో వచ్చే యాక్టర్ కోసం ఇలా చేయోద్దంటూ ఓ పోస్ట్ లో రాసుకొచ్చింది దివ్య. దివ్య వేలమూరి హౌస్ లో ఉన్నన్ని రోజులు స్ట్రాటజీలు ప్లే చేస్తూ, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచింది. అయితే తనకి హౌస్ లో ఎవరు సపోర్ట్ చేయకపోవడం పెద్ద మైనస్ అయింది. భరణిని అన్నయ్య పిలిచి అతనితో ఉండటం కొంతమందికి నచ్చలేదు. వారివల్ల దివ్య గేమ్ కూడా అంతగా ఆడలేకపోయింది. 

The Raja Saab: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!

Publish Date:Dec 17, 2025

  రాజా సాబ్ గురించి ఊహించని న్యూస్ కామెడీ తక్కువ.. ఎమోషన్స్ ఎక్కువ మారుతీ మ్యాజిక్ చేస్తాడా?   ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న మొదటి హారర్ ఫిల్మ్ ఇది.    'రాజా సాబ్' మూవీ హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ తో పాటు, ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దీంతో సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల విందు ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.   అయితే 'రాజా సాబ్' సినిమాలో కామెడీ పెద్దగా ఉండదని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మారుతీ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. పైగా హారర్ కామెడీ అంటే.. మారుతీ మరింతగా నవ్విస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, 'రాజా సాబ్'లో కామెడీ కంటే ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారట.   Also Read: వారణాసి సెట్స్ కి జేమ్స్ కామెరూన్.. టైగర్ తో షూట్!   'రాజా సాబ్'లో కామెడీ సీన్స్ తక్కువేనట. ప్రభాస్ పాత్ర మాత్రమే సరదాగా ఉంటూ.. వన్ లైనర్స్ తో అక్కడక్కడా నవ్విస్తుందట. సినిమా మొత్తం ఓ ఎమోషనల్ జర్నీలా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారట. ఇక పతాక సన్నివేశాలు కంటతడి పెట్టించడం ఖాయమని చెబుతున్నారు.   మారుతీ ఎమోషనల్ ఫిల్మ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకాలం కామెడీ తన బలం అని నిరూపించుకున్న మారుతీ.. ఇప్పుడు ఎమోషన్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయితే మాత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ 'రాజా సాబ్' చూడటానికి క్యూ కడతారు అనడంలో సందేహం లేదు.  

Rajamouli to finish Varanasi shoot by next year end

Publish Date:Dec 17, 2025

SS Rajamouli has been more silent than ever about his next movie, Varanasi. He normally tends to give updates from time to time indirectly about his films but in case of Varanasi, Priyanka Chopra did share a lot before he officially announced the title with a grand teaser.  Now, he is again maintaining silence but he clearly gave an update when Hollywood legend James Cameron asked him about the film. Recently, he watched the film Avatar: Fire and Ash and interacted with Cameron to promote the film in India. Rajamouli revealed that he liked the visual spectacle that the director managed to pull off.  During their conversation, he revealed that there is 9 months more shoot to finish and one year of it is completed. Also, he stated that he would be happy to welcome the director to his sets anytime. Jokingly, Cameron stated that he would be wishing to visit the sets if Rajamouli is working with tigers or animals.  Well, Mahesh Babu finished the shoot for Ramayana portions and he is currently preparing for a huge action sequence to be shot in specially erected sets. Once that scene shoot is over, there is talkie portion that is planned to be completed at a faster pace than a regular Rajamouli film aiming to complete shoot by next year end.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969