English | Telugu
Podharillu: గాయత్రీ మాటకి పెద్ద రచ్చ.. ఆ అమ్మాయి ఇంట్లో చక్రి!
Updated : Dec 18, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -08 లో..... మాధవకి వచ్చిన సంబంధం వాళ్ళు ఇంటిని చూడడానికి వస్తామని చెప్తారు. దాంతో వాళ్ళు ఇంటికి ఉన్న చిన్న చిన్న రిపేర్ లు చేద్దామని అనుకుంటారు. ఆ విషయం గాయత్రి ఫ్రెండ్ గాయత్రికి చెప్తుంది. మీ బావకి సంబంధం ఖాయం అయిందట అందుకే ఇల్లు రిపేర్ అంట అని అనగానే అది చెడగొట్టలని కావాలనే వాళ్ళ అమ్మకి వినపడేలా మాట్లాడుతుంది. ఇల్లు రిపేర్ చేస్తున్నారా అది కేసులో ఉంది కదా అంటుంది తాయారు. అదే మాట వాళ్ళ అన్నయ్య కూడా వింటాడు.
వెంటనే నారాయణ ఇంటి మీదకి గొడవకి వెళ్తాడు. ఇది కేసులో ఉందిని అంటాడు. నారాయణకి కోపం వస్తుంది. వాళ్ళని కొట్టబోతుంటే తన కొడుకులు ఆపుతారు. మరొకవైపు భూషణ్ కి మహా సపోర్ట్ చెయ్యలేదేని కోపంగా ఉంటాడు. నాదే తప్పు అంటావా.. నేను నీ భర్తని.. ఏం చేసిన కరెక్ట్ అనాలని భూషణ్ అనగానే ఇంకా మనకి పెళ్లి కాలేదని మహా అంటుంది. అలా భూషణ్ కి ప్రతీది వ్యతిరేకంగా మహా మాట్లాడుతుంటే భూషణ్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత మాధవకి గాయత్రి జున్ను తీసుకొని వస్తుంది. మా అమ్మ గొడవ చేసినట్లుందని అంటుంది. అయినా ఇల్లు రిపేర్ గురించి నాకే తెలియదు కానీ మీకెలా తెలుసని గాయత్రిని చక్రి అడుగుతాడు.
ఆ తర్వాత నేను ఒక అమ్మాయిని చూసానని కన్నాకి చక్రి చెప్తాడు. ఆ అమ్మాయి మళ్ళీ ఎదురుపడితే బాగుండు అని చక్రి అనుకుంటాడు. అప్పుడే తన ఓనర్ ఫోన్ చేసి.. డ్రైవర్ కావాలని ఒకరు ఫోన్ చేశారు.. రేపు ప్రొద్దున వెళ్ళమని అతను చెప్తాడు. తరువాయి భాగంలో డ్రైవర్ కావాలని ఫోన్ చేసింది భూషణ్ వాళ్లే.. చక్రిని చూడగానే భూషణ్ వద్దని చెప్తాడు. ఈ అమ్మాయి ఇక్కడే ఉంది.. ఎలాగైనా నేను ఇక్కడే ఉండాలని చక్రి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.