English | Telugu
Jayam serial: ఫుడ్ ఫెస్టివల్ కి గంగ.. రుద్ర చూసి షాక్!
Updated : Dec 18, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -144 లో.....గంగ పనికోసం అంతటా ట్రై చేస్తుంది.. అందరు నువ్వు గొప్పింటి కోడలు.. నీకు జాబ్ ఎందుకని అంటారు. మరొకవైపు నా రాజకీయ జీవితానికి ఆ రుద్ర అడ్డుపడుతున్నాడని ఇషికతో వీరు అంటాడు. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. ముగ్గురు కలిసి ఫుడ్ ఫెస్టివల్ గురించి ప్లాన్ చేస్తారు. అందులో ఫుడ్ పాయిజన్ చేసి అది గంగ పైకి వచ్చేలా చెయ్యాలనుకుంటారు. ఇప్పుడు గంగ పని కోసం ట్రై చేస్తుంది.
తను ఫుడ్ ఫెస్టివల్ కి వచ్చేలా ప్లాన్ చెయ్యాలని వీరు అంటాడు. మరొకవైపు గంగ గుడిలో కూర్చొని బాధపడుతుంది. అటుగా వెళ్తున్న రుద్ర తనని చూసి ఆగుతాడు. అక్కడే శ్రీను ఉంటాడు. ఏమైంది ఎందుకు గంగ ఏడుస్తుందని అడుగుతాడు. వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేదు కదా.. మందులకి డబ్బులు లేవు.. పని కోసం ట్రై చేస్తుంది కానీ ఎక్కడ పని దొరకడం లేదని శ్రీను చెప్తాడు. ఈ డబ్బులు తీసుకొని తనకు ఇవ్వు నేను ఇచ్చానని చెప్పకు అంటాడు. శ్రీను వెళ్లి డబ్బులు ఇస్తాడు ఇదంతా ఎక్కడివి అని గంగ అడుగుతుంది. పక్కకి చూస్తే రుద్ర కన్పిస్తాడు. ఇవి ఎవరు ఇచ్చారో నాకు తెలుసు కానీ నేను తీసుకోనని గంగ అనగానే అంత పొగరు వద్దని రుద్ర అంటాడు. ఇద్దరు కాసేపు ఇండైరెక్ట్ గా మాట్లాడుకుంటారు.
ఆ తర్వాత వీరు ఒక ప్లాన్ చేస్తాడు. మణి తన మనుషులను గంగ ముందుకి తీసుకొని వెళ్తారు.. పని గురించి కావాలనే మాట్లాడిస్తాడు. అది విన్న గంగ.. పనికి నేను వస్తానని చెప్తుంది. అది విజయేంద్ర ప్రతాప్ గారి ఫుడ్ ఫెస్టివల్ అని వాళ్ళు చెప్పగానే నేను వస్తానని గంగ అంటుంది. గంగ పనికి వస్తానని అంటుందని వీరుకి మణి చెప్తాడు. ఆ తర్వాత లక్ష్మీ దగ్గరికి రుద్ర వస్తాడు. మీరు వస్తారని తెలుసు ప్రొద్దున పెద్ద అయ్యగారు ప్రీతి, ప్రమీల వచ్చారు కానీ గంగ రానని చెప్పిందని లక్ష్మీ చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.