English | Telugu

కంటెస్టెంట్ కి కంటి చూపు తెప్పిస్తామన్న థమన్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆగష్టు 29 న లాంచ్ కాబోతోంది. ఇక ఈ షోకి జడ్జెస్ గా ఎప్పటిలాగే థమన్, కార్తీక్, గీతా మాధురి వచ్చారు. ఇక హోస్ట్ గా శ్రీరామచంద్ర వచ్చేసాడు. ఇక సమీరా భరద్వాజ్ ఐతే ముసుగు కప్పుకుని శ్రీరామచంద్ర చుట్టూ తిరుగుతూ "కైసే హో జీ" అంటూ హిందీలో అడిగింది. "మై టీక్ హూ జి" అని చెప్పాడు శ్రీరామచంద్ర. తర్వాత ముసుగు తీసి లకలకలకలక అంటూ భయపెట్టేసింది. "ఏంటి సమీరా నువ్వేమిటి ఇక్కడ" అన్నాడు. "మూడు సీజన్లుగా నువ్వొక్కడివే అల్లాడిపోతున్నావ్ గ ఇక్కడ ఈ సీజన్ లో ఇద్దరం కలిసి అల్లాడిద్దాం" అని చెప్పింది.

ఇక అద్భుతమైన కంటెస్టెంట్స్ వచ్చారు. ఇక థమన్, కార్తీక్ కలిసి చాలా ప్రామిస్ లు చేశారు కంటెస్టెంట్స్ కి. పవన్ కళ్యాణ్ సాంగ్ పాడిన ఒక కంటెస్టెంట్ కి థమన్ మాటిచ్చాడు. త్వరలో కలిసి మనం పని చేద్దాం అన్నాడు. ఇక ఒక కంటెస్టెంట్ ఐతే ఫ్లూట్ పట్టుకుని వచ్చి పాడిన సాంగ్ కి మంచి మ్యాటర్ ఉంది అంటూ గీత మాధురి కాంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక కార్తీక్ సాంగ్ పాడుతుంటే ఆ కంటెస్టెంట్ దానికి ఫ్లూట్ తో మ్యూజిక్ ని అందించాడు. తర్వాత ఒక దివ్యాంగుడు వచ్చారు. ఆయనకు కళ్ళు కనిపించవు. ఇక అతను పాడిన పాటకు జడ్జెస్ ముగ్గురు ఫుల్ ఫిదా ఇపోయారు. థమన్ ఐతే "ఎలా మీకు కంటి చూపు లేదు అనేసరికి చిన్నప్పటి నుంచి లేదు సర్ చూపు" అన్నాడు. "నేను కార్తీక్ కలిసి నీకు కంటి చూపు వచ్చేలా చేస్తాం" అని ప్రామిస్ చేసాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.