English | Telugu

Jayam serial: ఇంట్లో నుండి వెళ్ళిపోయిన గంగ.. పైడిరాజు గొడవ!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -35 లో......శకుంతల గంగకి టిఫిన్ తీసుకొని వస్తుంది. శకుంతల తనతో ప్రేమగా మాట్లాడుతుంటే మా అమ్మ కూడా ఇలాగే మాట్లాడేది అని లక్ష్మి మాటలని గంగ గుర్తు చేసుకుంటుంది. గంగకి శకుంతల టిఫిన్ తినిపిస్తుంది. అదంతా పెద్దసారు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు లక్ష్మి ఒక దగ్గర కళ్ళుతిరిగి కిందపడిపోతుంది.

ఒక ఆయుర్వేద వైద్యడు చూసి లక్ష్మీ స్పృహలోకి వచ్చాక తనతో మాట్లాడతాడు. నాకు ఎవరు లేరు.. ఈ పని అయిన చేస్తూ జీవనం సాగిస్తానని లక్ష్మి చెప్పగానే అయితే గుడిలో పని చేయుటకి ఇంకా వంట చేయుటకు కావాలని పూజారి చెప్పారు.. ఆ పనులు చేస్తావా అని అతను అనగానే చేస్తానని లక్ష్మీ అంటుంది. మరొకవైపు రుద్ర దగ్గరికి గంగ వచ్చి థాంక్స్ చెప్తుంది. నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతానని చెప్తుంది. ఉండాలని రుద్ర చెప్తాడు. ఆ మాటలు అన్నీ ఇషిక, వీరు వింటారు. ఎలాగైనా గంగని ఇంట్లో నుండి పంపించాలని ఆ ఇద్దరు అనుకుంటారు. గంగ దగ్గరికి వెళ్లి.. నువ్వుంటే ఈ ఫ్యామిలీ ముక్కలవుతుందని ఇద్దరు కలిసి బెదిరిస్తారు. ఇండైరెక్ట్ గా గంగని ఇంట్లో నుండి వెళ్ళమని చెప్తారు.

ఆ తర్వాత పైడిరాజు ఇంటి దగ్గరికి కి వెళ్తాడు. అప్పుడే గంగ ఫ్రెండ్ వచ్చి పెద్దమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది. గంగని ఆ పెద్దింటి వాళ్ళు తీసుకొని వెళ్ళారని చెప్తాడు. ఇప్పుడు నన్ను ఎవరు పోషిస్తారని పైడిరాజు అనుకుంటాడు. ఆ తర్వాత నిద్ర నుండి గంగ సడెన్ గా లేచి నా వల్ల కుటుంబం విడిపోకూడదు.. నేనే వెళ్ళిపోతానంటూ ఇంట్లో నుండి బయల్దేర్తుంది. తరువాయి భాగంలో అందరు లేచేసరికి గంగ ఇంట్లో కన్పించదు. అప్పుడే పైడిరాజు.. పెద్దసారు ఇంటి ముందుకి వచ్చి నా కూతురుని నాతో పంపించండి అని గొడవ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.