English | Telugu

Brahmamudi : కావ్య బిడ్డకి తండ్రి రాజ్ అని చెప్పాలనుకున్న అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -808 లో... కావ్యతో రాజ్ ఉన్న సంఘటనలు గుర్తుచేసుకుంటాడు. అలాగే కావ్య కూడా రాజ్ తో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది.

మరొకవైపు రాహుల్, రుద్రాణి ఇద్దరు మాట్లాడుకుంటారు. నేను ఇన్ని రోజులు రాజ్ ని ఈ ఇంటికి దూరం చెయ్యాలని ట్రై చేసాను కానీ వాడంతట వాడే ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాడు.. ఇక ఎప్పటికీ రాడు అని రాహుల్ తో రుద్రాణి చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి అపర్ణ, ఇందిరాదేవి భోజనం తీసుకొని వస్తారు. కావ్య ఏడుస్తూ వాళ్ళకి తన బాధని చెప్తుంది. ఆ తర్వాత వైదేహి వాళ్ళు భోజనం చేస్తూ రాజ్ ని పిలుస్తారు. నాకు ఆకలిగా లేదని రాజ్ చెప్తాడు. రాజ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే యామిని వెళ్లి.. నీ బాధ ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని రాజ్ కి మందు బాటిల్ ఇస్తుంది. రాజ్ బాధపడుతూ యామినిపై పడిపోయి ఎమోషనల్ అవుతుంటే యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత రాజ్ డ్రింక్ చేస్తాడు. తాగి రోడ్డుకి అడ్డంగా పడుకుంటాడు. అప్పుడే కళావతి 'ఎవరు రోడ్డుకి అడ్డుగా' అని కార్ దిగి వచ్చి చూసేసరికి రాజ్ ఉంటాడు. రాజ్ ని అలా చూసి కావ్య షాక్ అవుతుంది. వెంటనే డ్రైవర్ సాయంతో కార్ లోకి ఎక్కిస్తుంది.

తరువాయి భాగంలో రాజ్ ని ఆ ఇంటి నుండి తీసుకొని రావాలి.. కావ్య కడుపులో బిడ్డకి తండ్రి నువ్వేరా అని చెప్తానని అపర్ణ నిర్ణయం తీసుకుంటుంది. అది విని కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.