ఆర్టీసి సంఘాల్లో ఆతృతను నింపిన సిఎం కెసీఅర్ సమీక్ష...
తెలంగాణ హై కోర్టు ఉత్తర్వుల కాపీ ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో సీఎం కే సీ ఆర్ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలన్నది నిర్ణయించనుంది ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఒకవేళ చర్చలు జరిగితే ఎవరి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలి అనేది కూడా ప్రభుత్వం తేల్చబోతోంది.