చినజీయర్ స్వామి చెంతకు పూరి, ఛార్మి
దర్శకుడిగా 'పూరిజగన్నాధ్' (Puri Jagannadh)శైలి ఎంతో విభిన్నం. తెలుగు సినిమాకి ఒక కొత్త తరహా సబ్జెట్స్ ని పరిచయం చేసిన ఘనత కూడా పూరి సొంతం. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న పూరి, తన గత చిత్రాలైన లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో పరాజయాలని అందుకున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని 'విజయ్ సేతుపతి'(Vijay Sethupathi)తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి(Charmme Kaur)నిర్మిస్తున్నారు.