English | Telugu

‘అవతార్‌3’కి ఏమైంది.. ‘అవతార్‌2’ని రీరిలీజ్‌ ఎందుకు చేస్తున్నారు?

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి ప్రేక్షకుల్ని ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్ళిన సినిమా ‘అవతార్‌’. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చేసి మరోసారి సంచలనం సృష్టించారు. ఈ సినిమా కూడా భారీ కలెక్షన్లు సాధించింది.

రెండో భాగాన్ని రిలీజ్‌ చేసేందుకు 13 సంవత్సరాల సమయం తీసుకున్న కామెరాన్‌.. అవతార్‌3కి మాత్రం మూడు సంవత్సరాలు మాత్రమే టైమ్‌ తీసుకున్నారు. డిసెంబర్‌ 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అవతార్‌2 మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అక్టోబర్‌ 3 నుంచి వారం రోజుల పాటు థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తారు. డిసెంబర్‌లో అవతార్‌ 3 రిలీజ్‌ కాబోతుండగా హఠాత్తుగా అవతార్‌2ను రీరిలీజ్‌ చెయ్యడం వెనుక రీజన్‌ ఏమిటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అవతార్‌3 చిత్రాన్ని చూసే ప్రేక్షకులను ప్రిపేర్‌ చేసేందుకే పార్ట్‌ 2ను రిలీజ్‌ చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రీరిలీజ్‌ ఇండియాలో కూడా ఉంటుందా లేక విదేశాలకే పరిమితం చేశారా అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఏది ఏమైనా అవతార్‌2 మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయబోతోంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.