English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో ఉండలేవు.. కేతమ్మకు షాక్ ఇచ్చిన నవదీప్

బిగ్ బాస్ అగ్నిపరీక్షకు మంచి కంటెంట్ ఇచ్చే కామన్ మ్యాన్ చాలా మంది ఎంట్రీ ఇస్తున్నారు. ఇక నల్గొండ నుంచి కేతమ్మ వచ్చింది. మేము గౌడంగలం..నేను కల్లు, ముంజెలు అమ్మాను. అనేసరికి మా కోసం కల్లు తెచ్చావా అని శ్రీముఖి అడిగింది. అమ్మ లేదు నాన్న లేడు. నేను పుట్టిన రెండు నెలలకు అమ్మ చచ్చిపోయింది. తాత, అమ్మమ్మ సాదారు నన్ను. గంతకు తగ్గ బొంత అన్నారు ఒక దిక్కు లేని వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. నన్ను బెజవాడకు తీసుకుపోయాడు. పెద్ద పాప కడుపులో పడ్డాక అప్పుల బాధ. నాట్లు వేయడానికి వెళ్ళా...పిల్లకు పాలు ఇచ్చాక నాకు తాగడానికి గంజి కూడా ఉండేది కాదు. నేను పడని కష్టం లేదు.

హైదరాబాద్ వచ్చాము. వాచ్ మ్యాన్ ఉద్యోగం చేశా. ఆ దేవుడి దయతో ఒక 200 గజాలు కొనుక్కున్న. నా భర్తకు పక్షవాతం వచ్చింది..కానీ బిగ్ బాస్ నుంచి మంచి అవకాశం వచ్చింది" అంది. "బిగ్ బాస్ హౌస్ లో ఉండలేవు కేతమ్మ..నువ్వు భోళా మనిషివి.." అన్నాడు నవదీప్..ఆమెకు రెడ్ సిగ్నల్ ఇచ్చాడు. బిందు మాధవి కూడా రెడ్ ఇచ్చింది. "మా సీజన్ లో గంగవ్వ అనే పెద్దావిడ వచ్చారు. ఆమెకు బిగ్ బాస్ హౌస్ సరిపడక బయటకు వచ్చేసారు" అని అభిజిత్ చెప్పాడు. "కానీ నేను ఎంత చేయాలో అంత చేయగలను" అని చెప్పింది కేతమ్మ. దాంతో అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతానికి నిన్ను హోల్డ్ లో పెడుతున్నాం అని చెప్పింది శ్రీముఖి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.