English | Telugu

Jayam serial : ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్న గంగ.. శకుంతల ఏం చేయనుంది!


జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -34 లో.....గంగని తీసుకొని శకుంతల ఇంటికి వస్తుంది. వద్దని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇప్పుడు గంగ ఉంటే నష్టం ఏముందని శకుంతల అంటుంది. మీకు నా నిర్ణయం ఇబ్బంది పెడితే చెప్పండి విడిగా ఉందామని శకుంతల అనగానే అందరూ షాక్ అవుతారు. గంగని తీసుకొని నేనే వెళ్ళిపోతానని శకుంతల చెప్తుంది.

పెద్దమ్మ ఇంకొకసారి ఆ మాట అనకండి ఇన్నిరోజులు ఈ కుటుంబం మీ నిశ్శబ్దం చూసింది.. ఇప్పుడు మీరు లేకుండా ఈ ఇల్లు ఉండదు.. మీ నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పరని రుద్ర అంటాడు. ఆ తర్వాత శకుంతల కోడలు, కూతురు గంగని తీసుకొని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లిన తర్వాత గంగ ఏడుస్తుంటే వాళ్ళు ఓదారుస్తారు. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటే గంగ వస్తుంది. గంగని చూసి కావాలనే ఇషిక తను బాధపడేలా మాట్లాడుతుంది. అందరూ ఫోన్ చేసి ఆ గంగని ఎందుకు మీ ఇంట్లో ఉంచుకున్నారని అడుగుతున్నారని అంటుంది. ఆ మాటలు గంగ విని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత శకుంతల వచ్చి గంగకి టిఫిన్ తీసుకొని వెళ్తుంది.

శకుంతల వెళ్లేసరికి గంగ ఏడుస్తుంది. తనని పైన కూర్చొబెట్టుకొని దైర్యం చెప్తుంది. మా అమ్మ కూడా ఇలాగే చెప్పేదని వాళ్ళ అమ్మ ఏమందో శకుంతలకి చెప్తుంది గంగ. తరువాయి భాగంలో ఇషిక, వీరు కలిసి గంగ తో మాట్లాడతారు. తను ఇంట్లో నుండి వెళ్లిపోయేలా మాట్లాడతారు. శకుంతల కాళ్ళు మొక్కి గంగ ఇంట్లో నుండి వెళ్లిపోవాలని ట్రై చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.