English | Telugu
సమంత `మెగా` సెంటిమెంట్.. ఓ కామన్ ఫ్యాక్టర్!
Updated : Dec 15, 2021
మెగా కాంపౌండ్ కి అచ్చొచ్చిన కథానాయికల్లో సమంత ఒకరు. `అత్తారింటికి దారేది` (2013) కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించి.. ఆ క్యాంప్ లో తొలి విజయాన్ని చూసింది సామ్. ఆపై రెండేళ్ళ తరువాత `సన్నాఫ్ సత్యమూర్తి` (2015)లో అదే కాంపౌండ్ కి చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఆడిపాడింది. ఆనక మూడేళ్ళ అనంతరం `రంగస్థలం` (2018)లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి జంటగా కనువిందు చేసింది. ఈ మూడు చిత్రాలతోనూ మెమరబుల్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుందీ చెన్నై పొన్ను.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మళ్ళీ బన్నీతో `పుష్ప - ద రైజ్` కోసం జట్టుకట్టింది సమంత. ఇందులో నాయికగా కాకుండా, ``ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామా`` అంటూ ఓ ప్రత్యేక గీతంలో చిందులేసింది సామ్. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటివరకు మెగా క్యాంప్ లో సమంత చేసిన సినిమాలన్నింటికీ కూడా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్. `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `రంగస్థలం`తో పాటు రాబోయే `పుష్ప - ద రైజ్`కి కూడా తను అందించిన స్వరాలు సంచలనం సృష్టించాయి.
మరి.. మెగా కాంపౌండ్ లో ఇప్పటివరకు నాయికగానే విజయాలు అందుకున్న సామ్.. స్పెషల్ సాంగ్ తోనూ సక్సెస్ చూస్తుందేమో చూడాలి. అలాగే, మెగా - సామ్ కాంబోకి డీఎస్పీ ఫ్యాక్టర్ మరోసారి ప్లస్సవుతుందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.
