English | Telugu

`పుష్ప‌`.. డీఎస్పీతో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టేనా!

`పుష్ప‌`.. డీఎస్పీతో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టేనా!

ప్ర‌స్తుతం తెలుగునాట అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా రాణిస్తోంది మైత్రీ మూవీ మేక‌ర్స్. `శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `రంగ‌స్థ‌లం`తో హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టి వార్త‌ల్లో నిలిచిన మైత్రీ.. ఆపై `చిత్ర‌ల‌హ‌రి`, `మ‌త్తు వ‌ద‌ల‌రా`, `ఉప్పెన‌` వంటి విజ‌యాలు చూసింది. క‌ట్ చేస్తే.. ఈ వారం  పాన్ - ఇండియా మూవీ `పుష్ప - ద రైజ్`తో జ‌నం ముందుకు రానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాని బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు అందించాడు.

ఇదిలా ఉంటే.. దేవి శ్రీ కాంబినేష‌న్ లో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన చిత్రాల‌న్నీ మ్యూజిక‌ల్ గా మెప్పించ‌డ‌మే కాకుండా క‌మ‌ర్షియ‌ల్ గానూ అల‌రించాయి. `శ్రీ‌మంతుడు`, జ‌న‌తా గ్యారేజ్`, `రంగ‌స్థ‌లం`, `చిత్ర‌ల‌హ‌రి`, `ఉప్పెన‌`.. ఇలా డీఎస్పీ కాంబోలో ఇప్ప‌టికే ఐదు విజ‌యాలున్నాయి మైత్రీ సంస్థ‌కి. ఈ నేప‌థ్యంలో.. `పుష్ప - ద రైజ్`తో దేవి శ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ డ‌బుల్ హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి.

కాగా, `పుష్ప - ద రైజ్`లో ర‌ష్మికా మంద‌న్న నాయిక‌గా న‌టించ‌గా.. స‌మంత ప్ర‌త్యేక గీతంలో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. ఫ‌హ‌ద్ ఫాజిల్, సునీల్, అన‌సూయ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.