English | Telugu

Ande Sri: తెలంగాణ సాహితీ శిఖరం 'అందెశ్రీ' కంటతడి పెట్టిన సందర్భం..!

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..
చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి..
ఇలా ఒకటా రెండా.. పాట బ్రతికున్నంతకాలం, ప్రజలు పాడుకునే ఎన్నో గొప్ప పాటలను అందించారు అందెశ్రీ.

తెలంగాణ ఉద్యమ పతాకాన్ని రెపరెపలాడించిన గొప్ప కవులలో అందెశ్రీ ఒకరు. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందెశ్రీ.. జనగాం దగ్గరలోని రేబర్తి అనే గ్రామంలో 1961, జులై 18న జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య.

అందెశ్రీ పాఠశాలకు వెళ్ళి పుస్తక పాఠాలు నేర్చుకోలేదు. ప్రకృతి ఒడిలో జీవిత పాఠాలు నేర్చుకున్నారు. ఆ పాఠాలనే పాటలుగా మలిచి.. కోట్లాది ప్రజల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.

గొడ్ల కాపరిగా, భవన కార్మికుడిగా పని చేసిన అందెశ్రీ.. సామాన్యుల కష్టాన్ని వినిపించే కలం అయ్యారు. తెలంగాణ గురించి, ప్రకృతి గురించి, ప్రజల గురించి.. ఎన్నో గొప్ప పాటలు రచించారు.

Also Read:ప్రజాకవి అందెశ్రీ కన్నుమూత!

అందెశ్రీ కలం నుండి జాలువారిన గీతాలలో 'జయ జయహే తెలంగాణ'కు ప్రత్యేక స్థానముంటుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ.. 'జయ జయహే తెలంగాణ' అంటూ ఉద్యమ జ్యోతిని వెలిగించారు. ఈ పాట ఎందరినో కదిలించింది. పిడికిలి బిగించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడేలా చేసింది.

ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో 'జయ జయహే తెలంగాణ' గీతం తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందే.. దీనిని రాష్ట్ర గీతంగా భావించారు ఉద్యమకారులు.

అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 'జయ జయహే తెలంగాణ' పాట.. రాష్ట్ర అధికారిక గీతంగా మారడానికి దశాబ్దకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.

'జయ జయహే తెలంగాణ' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా 2024, ఫిబ్రవరి 4న సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. 2024, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ రౌండ్స్ లో జరిగిన వేడుకలో ఈ గీతాన్ని ఆవిష్కరించారు.

ఈ పాట ఆవిష్కరణ సందర్భంగా అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. పాట వినిపించినంత సేపు ఆయన కళ్ళలో నీళ్లు ఆగలేదు. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్ళ ఎదురుచూపుల తర్వాత తన పాటకు దక్కిన గౌరవానికి వచ్చిన ఆనందభాష్పాలు.

'జయ జయహే తెలంగాణ' గీతావిష్కరణ సమయంలో అందెశ్రీ కంటతడి పెట్టుకున్న సందర్భం.. కోట్లాది తెలంగాణ ప్రజానీకానికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తెలంగాణ ఉన్నంతకాలం 'జయ జయహే తెలంగాణ' గీతం ఎలా ఉంటుందో.. అలాగే, అందెశ్రీ భావోద్వేగానికి గురైన ఆ సందర్భం కూడా తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.