English | Telugu

‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను: సాయి ధరమ్ తేజ్

‘మయసభ’ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను: సాయి ధరమ్ తేజ్

Publish Date:Jul 31, 2025

  వైవిధ్యమైన కంటెంట్‌తో అలరిస్తున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.    ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. "దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ‘ఆటోనగర్ సూర్య’ చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. అలా ఆ జర్నీ నుంచి ‘రిపబ్లిక్’ వచ్చింది. ఇప్పుడు దేవా కట్టా గారి కోసం ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే ఎప్పుడో చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ఈ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను"అని అన్నారు.   దేవా కట్టా మాట్లాడుతూ .. "మయసభ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం. ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేది. అయితే శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ ‘మయసభ’. ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథ రాశాను. అయితే సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌ను రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టింది. ధనీష్‌ను కలిసిన తరువాతే ‘మయసభ’కు ఈ లుక్ వచ్చింది. స్కామ్, మహారాణి వంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్‌లను సోనీ లివ్ అందించింది. సోనీ నుంచి అద్భుతమైన కథలు వచ్చాయి. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లాను. అప్పుడు ధనీష్ కలిశారు. ఆయనకు ‘మయసభ’ పాయింట్ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లింది. కిరణ్ నాతో ఎన్నో ఎళ్ల నుంచి ప్రయాణిస్తున్నారు. బాహుబలి, రిపబ్లిక్ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ టైంలో తోడు నిలిచారు. విజయ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. విజయ్ వల్లే ‘ప్రస్థానం’ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి కూడా విజయ్ బ్యాక్ బోన్‌‌లా నిలిచారు. ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నాం. దివ్యా గారు అద్భుతంగా నటించారు. ఈ ప్రాజెక్టుని జ్ఞాన శేఖర్‌తో స్టార్ట్ చేశాం. ఆ తరువాత సురేష్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా మలిచారు. ప్రొడక్షన్ డిజైనర్ కామేష్, తిరుమలకు థాంక్స్. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం అయ్యాక కిరీటం పెట్టినట్టుగా.. శక్తి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఆగస్ట్ 7 నుంచి ‘మయసభ’ అందరి ముందుకు రానుంది. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది’ అని అన్నారు.   సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ మాట్లాడుతూ .. "కరోనా కంటే కాస్త ముందుగా మా ఓటీటీ సంస్థను ప్రారంభించాం. మన ఇండియన్ కథల్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించాలని అనుకున్నాం. అందులో భాగంగా హిందీ, మలయాళంలో గొప్ప గొప్ప కథల్ని తెరకెక్కించాం. ఇప్పుడు తెలుగులో ‘మయసభ’ అనే అద్భుతమైన సిరీస్‌ను నిర్మించాం. శక్తి మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ. 2022లో ఈ కథను దేవా కట్టా గారు మాకు వినిపించారు. సోనీ లివ్‌లో ఇదొక గొప్ప సిరీస్‌గా నిలిచిపోతుందని నమ్ముతున్నాం." అని అన్నారు.   సోనీ లివ్ కంటెంట్ హెడ్ షోగత్ ముఖర్జీ మాట్లాడుతూ .. "దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా తెరకెక్కించారు. కథను ఎంత అందంగా నెరేట్ చేశారో.. అంతే అద్భుతంగా తీశారు. ఎంతో గొప్ప నటీనటులు అందరూ ఆ ప్రాజెక్ట్‌లో నటించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం దేవా కట్టా గారు మూడు, నాలుగేళ్ల సమయం తీసుకున్నారు. దేవా గారు ఈ సిరీస్ కోసం వందకు 150 శాతం కష్టపడ్డారు. ఈ సిరీస్‌ను సోనీ లివ్‌కు చేసి పెట్టిన దేవా కట్టా గారికి థాంక్స్" అని అన్నారు.   ఆది పినిశెట్టి మాట్లాడుతూ .. "పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండేది. దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా రాశారు. అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం దేవా కట్టా గారు పని చేస్తున్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్‌ని సపోర్ట్ చేస్తున్న సోనీ లివ్‌ టీంకు థాంక్స్. దేవా గారు కన్న కలను ‘మయసభ’ టీం నిజం చేసింది. శక్తి ఇచ్చిన మ్యూజిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా నటించారు. ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్‌‌‌లోకి రాబోతోంది. ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్‌’‌లా ‘మయసభ’ నిలిచిపోతుంది. రెండో సీజన్ కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.   చైతన్య రావ్ మాట్లాడుతూ .. "దేవా కట్టా గారు చేసిన ‘వెన్నెల’ నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు కిరణ్ అన్న ఎంతో సహకరించారు. శక్తి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత హర్ష గారు చాలా మంచి వ్యక్తి. దివ్యా మేడం, నాజర్ సర్, సాయి కుమార్ వంటి యాక్టర్లతో పని చేయడం అదృష్టం. ఆదితో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆది నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. నా ప్రయాణంలోని ప్రతీ మైల్ స్టోన్‌లో నాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది’ అని అన్నారు.   నిర్మాత శ్రీ హర్ష మాట్లాడుతూ .. "మయసభ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఎనిమిదేళ్ల క్రితం కలలు కన్న ప్రాజెక్ట్‌కి ఇప్పుడు రూపం వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ను దేవా గారు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది" అని అన్నారు.   నిర్మాత విజయ్ కృష్ణ లింగమనేని మాట్లాడుతూ .. ‘"దేవా గారు ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆది, చైతన్య రావు, సాయి కుమార్ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. శక్తి కాంత్ మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అని అన్నారు.   చరితా వర్మ మాట్లాడుతూ .. "నన్ను నమ్మి నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఆది, చైతన్య గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది. మా కోసం ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అని అన్నారు.   నటి దివ్యా దత్తా మాట్లాడుతూ .. "నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా కట్టా గారికి థాంక్స్. ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. తెలుగులో ఇది నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంత మంచి ప్రాజెక్ట్‌తో తెలుగులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. ‘మయసభ’ సెట్‌‌లో సరదాగా అందరం కలిసి నటించాం. ఈ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.   మ్యూజిక్ డైరెక్టర్ శక్తి కాంత్ కార్తీక్ మాట్లాడుతూ .. "మయసభ సిరీస్‌లో అవకాశం ఇచ్చిన దేవా గారికి థాంక్స్. బృందా తరువాత సోనీ లివ్‌లో ఇది నాకు రెండో ప్రాజెక్ట్. ‘మయసభ’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.   డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ .. "నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవా గారికి, సోనీ లివ్ గారికి థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన తేజ్ గారికి థాంక్స్. ఆగస్ట్ 7న బ్లాస్ అయ్యేలా ‘మయసభ’ రాబోతోంది" అని అన్నారు.  
Hrithik and Kiara rock in WAR 2 Aavan Jaavan single

Hrithik and Kiara rock in WAR 2 Aavan Jaavan single

Publish Date:Jul 31, 2025

Yash Raj Films released the first track of War 2, a groovy romantic track, Aavan Jaavan, featuring superstars Hrithik Roshan & Kiara Advani in their coolest ever self! The team behind the blockbuster song Kesariya from Brahmastra have reunited in Aavan Jaavan, thanks to Ayan Mukerji.  So, composer Pritam, lyricist Amitabh Bhattacharya and singer Arijit Singh have again given India a romantic song to cherish. The female vocals for the song are done by the young and versatile singer Nikhita Gandhi. Aavan Jaavan is currently winning the internet due to Hrithik & Kiara’s infectious chemistry and effortless vibe. YRF had announced yesterday that Aavan Jaavan will be the company’s gift to Kiara Advani and her massive, loyal fan base to mark her birthday and looks like the song is already a massive winner. War 2 has been directed by Ayan Mukerji and is produced by Aditya Chopra. War 2 releases on August 14th in theatres worldwide in Hindi, Telugu & Tamil.

Kingdom Movie Review

Publish Date:Jul 31, 2025

నటుడిగా సక్సెస్‌ అయిన శరత్‌బాబు.. వ్యక్తిగత జీవితంలో ఫెయిల్‌ అవ్వడానికి కారణాలు ఇవే!

Publish Date:Jul 31, 2025

(జూలై 31 నటుడు శరత్‌బాబు జయంతి సందర్భంగా..) అందం, అభినయం, మంచి ఎత్తు.. హీరోగా రాణించడానికి ఉండాల్సిన లక్షణాలు. ఇవి ఉన్నంత మాత్రాన హీరోగా సక్సెస్‌ అవుతారన్న గ్యారెంటీ కూడా లేదు. ఎందుకంటే.. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. ఆ అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత అది సాధ్యం కాకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లినవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే కొందరు మాత్రం క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా స్థిరపడిపోయారు. అలాంటి వారిలో విలక్షణ నటుడు శరత్‌బాబు గురించి చెప్పుకోవచ్చు. హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనికి ఉన్నప్పటికీ సక్సెస్‌ఫుల్‌ హీరో అవ్వలేక చివరికి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయారు.  1951 జూలై 31న ఆంధ్రప్రదేశ్‌లోని ఆముదాలవలసలో జన్మించారు శరత్‌బాబు. అతని అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. అయితే అతన్ని సత్యంబాబు అని పిలిచేవారు. ఆరడుగుల ఎత్తు ఉండే శరత్‌బాబుకి పోలీస్‌ ఆఫీసర్‌ అవ్వాలనే కోరిక ఉండేది. ఒకసారి పోలీస్‌ సెలెక్షన్స్‌కి కూడా వెళ్లారు. అయితే అతనికి కంటి సమస్య ఉన్న కారణంగా సెలెక్ట్‌ అవ్వలేదు. ఇదిలా ఉంటే.. మంచి అందగాడైన శరత్‌బాబును అందరూ హీరోలా ఉన్నావు అనేవారు. సినిమాల్లో అయితే రాణిస్తావు అని కూడా చెప్పేవారు. శరత్‌బాబు తల్లికి కూడా ఇదే అభిప్రాయం ఉండేది. అలా శరత్‌కి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. అదే సమయంలో ‘రామరాజ్యం’ చిత్రంలో కొత్తవారిని తీసుకుంటున్నారని తెలిసి.. ఆ సినిమా ఆఫీస్‌కి వెళ్లి డైరెక్టర్‌ బాబూరావును కలిశారు శరత్‌. హీరోలా ఉన్న అతన్ని చూసి సినిమాలో ఒక పాత్ర కోసం సెలెక్ట్‌ చేశారు.  శరత్‌బాబు చేసిన రెండో సినిమా ‘కన్నెవయసు’. రెండు సినిమాలు చేసినప్పటికీ అతనికి అవకాశాలు రాలేదు. 1970వ దశకం వచ్చేసరికి రమాప్రభ టాప్‌ కమెడియన్‌గా లెక్కకు మించిన సినిమాలు చేస్తున్నారు. అవకాశాల కోసం పరిశ్రమకు కొత్తగా వచ్చినవారికి తన ఇంటిలో వసతి కల్పించేవారు రమాప్రభ. అలా శరత్‌బాబు కూడా రమాప్రభ ఇంటిలో చేరారు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. శరత్‌బాబు కంటే రమాప్రభ నాలుగేళ్ళు పెద్ద వారు. ఎన్నో సినిమాల్లో శరత్‌బాబుకి వేషాలు ఇప్పించారు రమాప్రభ. అతని ఎదుగుదలకు రమాప్రభే ప్రధాన కారణం అయ్యారు.  కె.బాలచందర్‌, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకుల సినిమాల్లో నటించడం ద్వారా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు శరత్‌బాబు. మరోచరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, తొలికోడి కూసింది వంటి సినిమాలో శరత్‌బాబుకి మంచి పాత్రలు ఇచ్చి బాలచందర్‌ ప్రోత్సహించారు. అమెరికా అమ్మాయి, పంతులమ్మ వంటి సినిమాల్లో అతనికి మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చారు సింగీతం శ్రీనివాసరావు. ఈ సినిమాలు శరత్‌బాబు కెరీర్‌కి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత కె.విశ్వనాథ్‌ సాగరసంగమం, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు ఇచ్చారు. శరత్‌బాబు నటించిన సినిమాల్లో సీతాకోక చిలక, సితార, స్వాతి, అన్వేషణ, సంసారం ఒక చదరంగం, స్రవంతి, సంసారం ఓ సంగీతం వంటి సినిమాల్లో తను చేసిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని మెప్పించారు శరత్‌బాబు.  సీతాకోక చిలక, ఓ భార్య కథ, నీరాజనం చిత్రాల్లోని తన నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగా మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు శరత్‌బాబు. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1973లో ప్రారంభమైన శరత్‌బాబు, రమాప్రభల సహజీవనం 1987తో ముగిసింది. తమది పెళ్లి కాదని, అవకాశవాద వివాహం అని రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన ఆస్తి కోసమే శరత్‌బాబు తన పంచన చేరాడని, తన ఆస్తుల్ని బలవంతంగా లాక్కున్నాడని ఆమె ఆరోపించారు. అయితే రమాప్రభ ఆరోపణలను శరత్‌బాబు ఖండిరచారు. బలవంతంగా ఆస్తులు లాక్కోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. రమాప్రభ నుంచి విడిపోయిన తర్వాత 1990లో తమిళ నటుడు నంబియార్‌ కుమార్తె స్నేహ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు శరత్‌బాబు. 26 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరారు శరత్‌బాబు. నెలరోజుల పాటు ఆయనకు వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించారు. చివరికి మే 22న 71 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు శరత్‌బాబు. 

ఊపిరి ఊయలగా సాంగ్.. ఫ్యాన్స్ కి కియారా గ్లామర్ ట్రీట్!

Publish Date:Jul 31, 2025

  జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వార్ 2'. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న 'వార్ 2'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను మెప్పించింది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ విడుదలైంది.   'వార్ 2' విడుదలకు ఇంకా రెండు వారాలే సమయముంది. దీంతో సాంగ్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగల్ గా 'ఊపిరి ఊయలగా' సాంగ్ ను రిలీజ్ చేశారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.   'బ్రహ్మాస్త్ర'లోని బ్లాక్‌బస్టర్ సాంగ్ 'కేసరియా'ని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటకు హిందీలో అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు.   'ఊపిరి ఊయలగా' సాంగ్ వినసొంపుగా ఉంది. విజువల్స్ కూడా కలర్ ఫుల్ గా ఉన్నాయి. హృతిక్, కియారా మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కియారా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట.. ఆమె ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ సాంగ్ లో కియారా బికినీలో దర్శనమిచ్చింది.  

కూరగాయల మార్కెట్, కూకట్‌పల్లి ఫ్లైఓవర్ అదే తెలుసు నాకు అప్పటికి

Publish Date:Jul 31, 2025

  ప్రశాంత్ బిగ్ బాస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నావంటే ఏదో జరుగుతోంది ? అని అంది వర్ష. "అంతకు మించి" అని సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. "మనతో పాటు పొలంలో పని చేసిన అంకుల్స్, ఆంటీలు కానీ ఒరేయ్ కోతి నా కొడకా ఇది ఇంకా ఆపవా" అని అడిగితే "ఆపము అది. అది అట్లే నడుస్తూ ఉంటుంది. "ఉన్నది చిన్న ఫోన్..అందులో వీడియోస్ చేస్తే బిగ్ బాస్ వరకు వెళ్తాను అని ఎలా అనిపించింది" అని అడిగింది వర్ష ." ఒక సారి బాపు దగ్గర ఒక పెద్దాయన వచ్చారు. నీ కొడుకు ఎం చేస్తున్నాడు అంటే పొలం కాడ పని చేస్తున్నాడు అని చెప్పాడు. ఆయన కొంచెం తీసిపారేసినట్టు మాట్లాడాడు..దాంతో నాకు బాధ అనిపించింది. బాపు దగ్గర 500 లు తీసుకున్న.. హైదరాబాద్ కొత్త. ఎక్కడుండాలో తెలీదు. ఒక్కటే తెలుసు. కూరగాయల మార్కెట్,కూకట్‌పల్లి ఫ్లైఓవర్  కింద కూరగాయలు అమ్ముకోవాలి పోవాలే" అన్నాడు. "ఎవరినో అడగలనిపిస్తుంది నాకు "నీ హార్ట్ టప్ టప్ మని కొట్టుకుంటోంది. ఒక పోరి ఎలా ఉంది ? " అనేసరికి "తెల్లగా ఉంటది" అంటూ ప్రశాంత్ సిగ్గుతో కామెడీ చేసాడు. "బిగ్ బాస్ తర్వాత మీరు ఇద్దరూ టచ్ లో లేరా" అని అడిగింది. "షో ఐపోయాక మాట్లాడాను కానీ..ఆ తర్వాత ఇంకా మాట్లాడలేదు . మంచిగా ఉండాలని కోరుకుంటా అక్క" అంటూ ఆన్సర్ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 7 టైములో  హౌస్ లో పల్లవి ప్రశాంత్ , రతికా మధ్య ఒక లవ్ స్టోరీ నడిచిన విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కూడా రాతికతో బాగా క్లోజ్ అయ్యాడు. ఆమె ప్రపంచం అన్నట్టు ప్రవర్తించేవాడు. దాంతో నెటిజన్స్ కూడా పల్లవి ప్రశాంత్ ని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

ఒకే కారులో షికార్లు.. సమంత, రాజ్‌ డేటింగ్‌పై పెరిగిన పుకార్లు!

Publish Date:Jul 31, 2025

ఏ హీరోయిన్‌ అయినా తరచూ ఒకే వ్యక్తితో కనిపిస్తుంటే.. వారి మధ్య ఏదో ఉందనే పుకారు షికారు చేయడం సహజమే. ముఖ్యంగా ఇలాంటివి బాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ డేటింగ్‌ చేయడం, ఆ తర్వాత విడిపోవడం అనేది సర్వసాధారణం. ఈమధ్యకాలంలో సమంత, రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వస్తున్నాయి. అది నిజమేనన్నట్టు వారి ప్రవర్తన కూడా ఉండడంతో సోషల్‌ మీడియాలో ఇదే హాట్‌ డిస్కషన్‌గా మారింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటున్న సమంత.. కొంతకాలం అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తర్వాత సిటాడెల్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. అంతకుముందు ది ఫ్యామిలీ మ్యాన్‌2లో కూడా కనిపించింది. ఈ రెండు వెబ్‌ సిరీస్‌లకు రాజ్‌, డి.కె. దర్శకులు. ఆ వెబ్‌ సిరీస్‌ల తర్వాత సమంత, రాజ్‌ నిడిమోరు మధ్య బంధం బలపడిందనే రూమర్‌ వినిపించింది. అనేక మార్లు ఇద్దరూ కలిసి కనిపించడమే దానికి కారణం. ఇద్దరూ కలిసి హాలిడేకి వెళ్లడం, ఏదో ఒకచోట ఇద్దరూ కలిసి కనిపించడం ఆ రూమర్లకు బలం చేకూరుస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరిలో ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. అలాగని పబ్లిక్‌గా కలిసి కనిపించడం కూడా మానలేదు. అంతేకాదు, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌లో రాజ్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తోంది సమంత. తాజాగా ముంబై వీధుల్లో సమంత, రాజ్‌ కలిసి ఒకే కారులో వెళ్తున్న దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. వారిద్దరూ ఒక రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేసి తిరిగి వస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగచైతన్యతో సమంత విడిపోయి నాలుగు సంవత్సరాలవుతోంది. ఇప్పుడు రాజ్‌తో డేటింగ్‌ చేస్తోందనే వార్త నిజమైతే త్వరలోనే వీరి బంధానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. 

Which star hero is making a cameo in Kingdom?

Publish Date:Jul 30, 2025

Vijay Deverakonda, Bhagyashree Borse, Satyadev are playing prominent leading roles in the upcoming biggie, Kingdom. The movie team have been promoting the film, actively, from the past few days. In the recent press event, Vijay confirmed that there is a star hero cameo in the film.  There is a shot in the trailer and press people have asked him, if there is a cameo and he stated that it will be a star hero, only. Now, Internet is busy discussing about the hero, who is going to be appear in the cameo. Some are predicting it could be Jr. NTR and some are saying it could be a Tamil star.  While few people are stating that looking at the person, it could be someone like Karthi or Malayalam hero Fahadh Faasil or Vishal. For now, the speculations are going around social media in a big way. Few people are also commenting that it could a promotional tactic to grow buzz and anticipation for the film.  Gowtam Tinnanuri is directing the movie after a critically acclaimed film like Jersey. With this film, he is also entering into massive action sector and the anticipation is very high. Anirudh Ravichander scored music for the film and Anna Antene song became famous, already.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

కింగ్‌డమ్

Publish Date:Jul 31, 2025

జూనియర్

Publish Date:Jul 18, 2025

Kingdom

Publish Date:Jul 31, 2025

Mahavatar Narsimha

Publish Date:Jul 25, 2025

Hari Hara Veera Mallu

Publish Date:Jul 24, 2025

Junior

Publish Date:Jul 18, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025