వై.యస్సార్.కాంగ్రేసులో కొత్త లుకలుకలు

Publish Date:Jan 1, 2013

Advertisement

 

 

 

ఒకనాడు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని తెలంగాణాలో కాలుకూడా పెట్టనీయని తెలంగాణా ప్రజలు, ఆ తరువాత షర్మిల చేపట్టిన పాదయత్రకి తరలివచ్చేరంటే, అందుకు జగన్మోహన్ రెడ్డి లేదా అతని తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిల ప్రభావం మాత్రం కానేకాదని చెప్పవచ్చును. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మొదటినుండి అత్యంత విదేయురాలిగా ఉంటున్న కొండా సురేఖ, గత సంవత్సరకాలంగా చేసిన కృషికారణంగానే, తెలంగాణా ప్రజల మనసులలో వై.యస్సార్.సి. పార్టీ పార్టీ పట్ల తెరాస నాటిన వ్యతిరేకభావజాలాన్ని కొంతమేరయిన తొలగి, షర్మిల పాదయాత్రకి కొంత సానుకూల స్పందన కనబడిందని చెప్పవచ్చును. ఆ విదంగా పార్టీని తెలంగాణాలో క్రమంగా పునరుజ్జీవింపజేసిన కొండా సురేఖ తెలంగాణాలో వై.యస్సార్.సి. పార్టీకి ముఖచిత్రంగా నిలిచిందని నిసందేహంగా చెప్పవచ్చును. అందువల్లనే, ఆ పార్టీకి అన్నీ తానయి తెలంగాణాలో ఆమె చక్రం తిప్పుతోందని, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. అయితే, వారి ఆ అంగీకారం వెనుక కొండా దంపతుల ఆధిపత్య ధోరణిని పట్ల, ముఖ్యంగా ఆమె భర్త కొండా మురళి వైఖరిపట్ల పార్టీ నేతల అసంతృప్తి కూడా దాగిఉంది.


 

వై.యస్సార్.సి. పార్టీలో ఎవర్ని జేరనీయలో, ఎవరిని జేరనీయకుడదో కొండా మురళి నిర్నయించుతుండటం, దానిని సురేఖ నిర్ణయంగా భావిస్తూ పార్టీ అదినాయకులు ఆమోదం తెలుపుతుండటం, తెలంగాణాలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు చాలామందికి ఇబ్బందికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు కూడా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలో జేరాలనుకొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి హట్టాతుగా తన నిర్ణయం మార్చుకొని, కాంగ్రెసును వీడితే తెరాస జేరుతాను తప్ప వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలో జేరానని ప్రకటించడమే ఇందుకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు.  అతనే గాకుండా, కాంగ్రేసుకు చెందిన జీవన్ రెడ్డి, గోనే ప్రకాష్ రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వంటి అనేక మంది సీనియర్లు తమ కంటే రాజకీయాలలో జూనియర్ అయిన కొండా మురళి ముందు చేతులు కట్టుకొని నిలబడటం ఇష్టంలేకనే ఆ పార్టీకి దూరంగా నిలిచిపోయినట్లు తెలంగాణాకు చెందిన కొందరు వై.యస్సార్.సి. పార్టీనేతలు అంటున్నారు. పార్టీ వ్యహారాల్లో మురళి ప్రమేయం తగ్గినపుడే, పార్టీ వైపు చూస్తున్న అనేక మంది ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు, జూనియర్లూ వారి అనుచరులతో కలిసి వచ్చి పార్టీలోజేరి తెలంగాణాలో పార్టీని బలపరచగలరని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం పార్టీలో, తెలంగాణాలో మురళి ‘హవా’ కొనసాగుతునందున, అది సాద్యం కాకపోవచ్చని, తద్వారా పార్టీ చాలా నష్టపోతోందని వై.యస్సార్.సి. పార్టీలో చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు.



అందువల్లనే, ఆ పార్టీకి చెందిన వై.వి.సుబ్బారెడ్డి వంటి సీనియర్లు జగన్ కుటుంబముతో వారికున్న సన్నిహిత సంబందాల కారణంగా, కొండా దంపతులకు బద్ద వ్యతిరేఖిగా ముద్రఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావును (తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు) నేరుగా పార్టీ అధిష్టానం వద్దకే తీసుకువెళ్ళి పార్టీలో సభ్యత్వం ఇప్పించారని తెలుస్తోంది. అంతే గాకుండా, క్రమంగా కొండా దంపతుల ఆదిపత్య ధోరణి కట్టడి చేయాలనే ఆలోచనతోనే, వై.వి.సుబ్బారెడ్డి వంటి కొందరు నేతలు, పార్టీ అదినేతలను కలిసి, మొన్న జరిగిన అఖిలపక్షసమవేశానికి కొండా సురేఖ పేరును ఆఖరి నిమిషంలో  తొలగింపజేసి, ఆమెకు బదులుగా మహేష్ రెడ్డిని పంపించినట్లు సమాచారం.



అయితే, కొండా దంపతులను వ్యతిరేఖిస్తున్నవారు కూడా కొండా సురేఖ చిత్తశుద్దిని శంకించకపోయినప్పటికీ, ఆమె భర్త కొండా మురళి ఆధిపత్య ధోరణిని మాత్రం భరించలేక పోతున్నారని తెలుస్తోంది. ఈ విభేదాలు క్రమంగా ముదిరి పాకాన్న పడినట్లయితే, అప్పుడు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తన ఉనికిని కాపాడుకోవడం కన్నా ముందు పార్టీ అంతర్గత కుమ్ములాటలలో కుప్పకూలిపోకుండా కాపాడుకోవలసి ఉంటుంది. ఏది ఏమయినా, ప్రస్తుతం, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి సరయిన దశానిర్దేశం చేయగల నాయకుడు లేకపోవడంవల్లనే, ఇటువంటి చిన్న సమస్యలు కూడా పెనుసమస్యలుగా మారేందుకు దోహదపడుతున్నాయని చెప్పవచ్చును. ఇటీవల తెలుగుదేశం పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు యఫ్.డి.ఐ. బిల్లు విషయంలో వోటింగులో పాల్గోననప్పుడు ఆ పార్టీలో చెలరేగిన ఇంతకంటే పెద్ద దుమారాన్ని ఆ పార్టీనేత చంద్రబాబు పాదయాత్రలో ఉన్నపటికీ ఎంతో సమర్దవంతంగా అదుపుచేయడం చూసినట్లయితే, పార్టీకి పటిష్టమయిన నాయకత్వం ఎంత అవసరమో తెలియజేస్తోంది. గానీ, దురదృష్టవశాత్తు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నాయకత్వ లోపమే పెను సమస్యగా మారింది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.