ధామినీ! మమ్మల్ని క్షమించు తల్లీ!

Publish Date:Dec 29, 2012

Advertisement

 

డిల్లీ అత్యాచార భాదితురాలు (ధామిని) మృతితో ఒక విషాదకర అధ్యాయం ముగిసింది. తనకు బ్రతకాలని ఉందని ఆమె కోరుకోన్నపటికీ బ్రతకలేకపోయింది. ఆమె స్త్రీగా జన్మించడమే ఆమెకు ఈ మరణ దండన విదించింది. ఆమెకే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన స్త్రీకయినా ఇటువంటి అనుభవాలే ఎదురవడం విచారకరం. కేవలం స్త్రీలకే గాకుండా ఆడపిల్లగా పుట్టిన పాపానికి అన్నెం పున్నెం ఎరుగని పసిపాపలు కూడా కామందుల పశువాంచకి బలయిపోవడం చూస్తే, మన చుట్టూ మానవ రూపంలో తిరుగాడుతున్న మృగాలు ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నాయో తెలుస్తోంది. ఉయ్యాలలో నిద్రించే పసికందుని, ట్వింకిల్... ట్వింకిల్... లిట్టిల్ స్టార్ అని ముద్దుముద్దుగా పలికే పసి బాలలను కూడా ఒంటరిగా వదలలేని దుస్థితిలో మన సమాజం ఉందంటే అది మనందరికీ కూడా సిగ్గుచేటు.

 

ఒకవైపు డిల్లీలో జోరుగా ఆందోళనలు సాగుతుండగానే మరో వైపు యధేచ్చగా అత్యాచారాలు జరుగుతుండటం, వాటికి ప్రజల, ప్రభుత్వస్పందన నామమాత్రంగానయిన కరువవడం మనం డిల్లీ సంఘటన నుండి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని గుర్తు చేస్తోంది. ఏదయినా ఒక సంఘటన జరిగిన వెంటనే కొద్ది రోజుల పాటు అందరూ ఉవ్వెత్తున ప్రతిస్పందనలు వ్యక్తం చేయడం, ఆ తరువాత మళ్ళీ ప్రజలు తమ దైనందిన జీవితచర్యలలోములిగిపోవడం, ప్రభుత్వం కూడా మరోఅంశం వైపు మరలి పోవడం జరుతోందేతప్ప ఎదురయిన ప్రతీ సమస్యకి పరిష్కారం వెతికి, అమలు చేసే వరకు పట్టుదల చూపాలని ఎవరు అనుకోకపోవడం వల్లనే, ఇటువంటి తీవ్ర సమస్యలు పునరావృతమవుతున్నాయి. అది డిల్లీ అత్యాచార సంఘటన కావచ్చును లేదా ముంబై దాడులు కావచ్చును. ప్రతీ అంశంపైన మన ప్రతిస్పందనలు తాత్కాలిక భావోద్వేగాలతో కూడుకోన్నవే తప్ప, సకారాత్మకమయిన చర్యలు మాత్రం అరుదుగా కనిపిస్తాయి.

 

ప్రస్తుతం మన ప్రభుత్వము, న్యాయస్థానాలు వెంటనే స్పందించి కొన్ని చర్యలు చేపడుతున్నపటికీ, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలలో మార్పులు చేసుకోవడం, సమాజంలో చైతన్యం తెచ్చేందుకు నిరంతర కార్యక్రమాలు చెప్పటడం వంటివి జరగాలి.

 

ప్రభుత్వము చిత్తశుద్ధితో, అకుంటిత దీక్షతో అమలు చేస్తున్న ఒకేఒక కార్యక్రమం ‘పోలియో నివారణ’ ద్వారా నేడు మనదేశం పోలియో మహమ్మారి నుండి ఏవిదంగా బయట పడగలిగిందో చూస్తే, ఎటువంటి పనయినా చిత్తశుద్దితో చేపడితే తగిన ఫలితాలు తప్పక వెలువడతాయని తెలుస్తోంది. ప్రజలలో చైతన్యంతోనే ఇటువంటి అత్యాచారాలు పూర్తిగా సమసిపోతాయని చెప్పలేకపోయినా, కొంత మేరకు వాటి తీవ్రత తగ్గించగలమని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

అయితే, ఇటువంటి సమస్య పరిష్కారానికి సమాజం తన కుటుంబం నుండే ప్రయత్నాలు మొదలుపెట్టవలసి ఉంటుంది. విద్య, ఆహారం, వస్త్రధారణ, కట్టుబాట్లు వంటి అనేక విషయాలలో మన సమజం బాలబాలికల మద్య తీవ్ర వ్యత్యాసం చూపుతూ, మగపిల్లలను కొంచెం ‘అధిక సమానం’ అనే రీతిలో పెంచడంవల్లనే, ఆ ప్రభావంతో పెరిగిన మగపిల్లలు తరువాతకాలంలో స్త్రీల పట్ల చులకనభావం ప్రదర్శిచడం జరుగుతోంది.

 

నిజం చెప్పాలంటే మన భారతీయ సంస్కృతికి లేదా ప్రపంచంలో మరే ఇతర దేశాల సంస్కృతికి అయినా అద్దం పట్టేవారు సాధారణంగా మహిళలే అయి ఉండటం, మహిళల ప్రత్యేకతని చాటిచెపుతోంది. అటువంటి మహిళల పట్ల సభ్య సమాజం తలదించుకొనే విదంగా మానవమృగాల హేయమయిన చర్యలకి పాల్పడుతున్నపటికీ మనం స్పందించకపోతే సమాజంలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. అంతే గాకుండా, భావితరల ముందు మనం దోషులుగా నిలబడవలసిన దుస్థితి కూడా ఎదుర్కోకతప్పదు.

 

చట్టాలు, శిక్షలు ఎన్ని మార్పులు చేసుకొనప్పటికీ, మనమంతా కలిసి భావిభారత పౌరులుగా తీర్చి దిద్దలనుకొంటున్న బాలలను బాల్యం నుండే కుటుంబంలో, తరగతి గదుల్లో బాలల మనస్సులో మనం మంచి విత్తులు నాటగలిగిన నాడు, సమాజంలో నేర ప్రవృత్తికూడా క్రమంగా అంతరించే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.