కోటి సంతకాలు జగన్ను జైలు నుంచి బయటపడేయగలవా?

Publish Date:Jan 3, 2013

Advertisement

 

తెలంగాణాలో జోరుగా సాగుతున్న తన పాదయాత్రని షర్మిల అకస్మాత్తుగా ముగించేయడంతో, గత కొన్ని రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకరకమయిన స్తబ్దత నెలకొంది. ఆ స్తబ్దతని, నిశబ్దాన్ని చెందిచడానికేనన్నట్లు మొదలుపెట్టిన కోటి సంతకాల సేకరణ జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని బయటకి తీసుకురాలేదని తెలిసినా కూడా కొనసాగించక తప్పని పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. కోటి సంతకాలతో ఒక ముద్దాయిని జైలు నుండి విముక్తం చేయగలిగేమాటయితే, ఈ పాటికి మనదేశంలో జైళ్లలో ఉన్న బడానేతలందరూ ఎప్పుడో బయటపడేవారు. ఆ సంగతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియక కాదు. గానీ, పార్టీలో ఏదో ఒక కార్యక్రమం జరగకపోయినట్లయితే, అది పార్టీ కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసి చివరికి పార్టీ ఉనికికే ప్రమాదంగా మారవచ్చును. అందుకే కోటి సంతకాల కార్యక్రమం మొదలయింది. షర్మిల పాదయాత్ర జరుగుతున్నంత కాలం కూడా చురుకుగా ఉన్న ఆ పార్టీనేతలు, కార్యకర్తలు ప్రస్తుతం చేసేదేమిలేక కోటి సంతకాల సేకరణలో పాల్గొంటూ, పార్టీ త్వరలో సరయిన రాజకీయ కార్యక్రమం ఏదయినా నిర్వహిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.

 

అయితే, ప్రస్తుతం నాయకత్వ సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆ పార్టీలో చొరవ తీసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఒకవేళ ఎవరయినా చొరవతీసుకొని ముందుకువచ్చి నిలబడి కార్యక్రమాలు మొదలుపెడితే, పార్టీలో ఎవరి నుండి ఏవిమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనో భయంతో నేతలందరూ పత్రికా స్టేట్మెంట్ లకే పరిమితమవుతున్నారు. తద్వారా, రాష్ట్రంలో పార్టీలో కార్యకర్తల సందడి, పార్టీ ఉనికి కూడా తగ్గినట్లు కనిపిస్తోంది.

 

ఈ నిశబ్దాన్ని చేదించేందుకు పార్టీ గౌరవాధ్యాక్షురాలు వై.యస్. విజయమ్మే మళ్ళీ చొరవక తీసుకోక తప్పట్లేదు. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన తెరాస నేత మహిపాల్ రెడ్డి పార్టీలో జేరెందుకు సముఖత చూపించడంతో, ఆ సందర్భాన్ని ఉపయోగించుకొంటూ మెదక్ జిల్లాలో ఒక భారీ బహిరంగసభను విజయమ్మ ఆద్వర్యంలోనిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం స్పష్టంగా తెలియజేయని కారణంతో, తెలంగాణా వాదులు ఆ పార్టీపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తుతున్న ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి సభకి చాలా ప్రాదాన్యం ఉందని చెప్పవచ్చును. ఈ సభ విజయవంతం కావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని చెప్పవచ్చును. అదే సమయంలో, తెలంగాణావాదులు కూడా తమనిరసనలు తెలియజేయడానికి కూడా ఇదే సభను వాడుకొనే అవకాశం ఉండటంవల్ల ఇది కీలకమయిన సభగానే భావించవచ్చును.

 

ఈ సభలోనే విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇకముందు ఎవరు నడిపించబోతున్నారో కూడా ప్రకటించే అవకాశం ఉంది. గనుక ఈ సభకు మరింత ప్రాదాన్యత ఉంటుంది.

 

ఏదేమయినా, సారధిలేకుండా నడుస్తున్న రధం వంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య తీరేవరకు అన్నిపార్టీలకు చులకనగానే కనిపిస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.