గోదావరి జిల్లాల్లో వైసీపీ జీరోయే!

Publish Date:Dec 31, 2023

Advertisement

ఏపీలో రానున్న ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖరారైంది. పరిశీలకుల విశ్లేషణలూ, సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు, చివరాఖరికి ఐప్యాక్ రిపోర్టులూ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. జగన్ కు కూడా విషయం అవగతమైనట్లే కనిపిస్తోంది.  అందుకే  పైకి ఎంత బింకంగా వైనాట్ 175 అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోన మాత్రం ఓటమి భయం   వెంటాడుతోంది. ప్రజలలో గూడు కట్టుకున్న అసంతృప్తిని కొంత వరకైనా తగ్గించాలని అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారు. ముందుగా ఇన్ చార్జిలను  మార్చేసి తర్వాత వారినే అభ్యర్థులుగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ ప్రయత్నం మరింత నష్టం తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా ఇప్పుడు జగన్ పై ఆగ్రహంతో ఉన్నారు. అసలే ప్రజలు తనని ఓడించేది ఖాయమైతే.. ఇప్పుడు ఎక్కడైనా ఏమూలో మిణుక్కుమిణుక్కు మంటూ గెలిచే అవకాశం ఉన్న స్థానాలను కూడా ఇన్ చార్జీల మార్పు పేరుతో జగన్ ఓటమి ఖాతాలో చేజేతులా వేసేసుకుంటున్నారు.  దీంతో ఈసారి వైసీపీకి ఘోర ఓటమి తప్పదని  పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, జగన్ మోహన్ రెడ్డి మొండిగా తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ కూడా ప్రతిపక్ష నేతలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.

 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే.. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉభయగోదావరి జిల్లాలు కీలకం. ఇక్కడ ఎక్కువ స్థానాలు ఏ పార్టీ సొంతం చేసుకుంటే ఆ పార్టీదే అధికారం. గత ఎన్నికలలో అధికారం దక్కించుకున్న వైసీపీ కూడా ఈ జిల్లల్లోఅత్యధిక స్థానాలను దక్కించుకుంది.  పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ గెలిచింది.  రెండు ఎంపీ స్థానాలు కూడా దక్కాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా 19 స్థానాలకు గాను వైసీపీ 14 చోట్ల గెలిచింది. మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలలకే ఇక్కడ అసంతృప్తి మొదలైంది. ఈ రెండు జిల్లాలో కాపు సామజిక వర్గం రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే  జగన్ కాపు రిజర్వేషన్లు కుదిరే అంశం కాదని తేల్చేయడం వైసీపీకి అతిపెద్ద మైనస్ గా మారింది. సాధారణ ప్రజలలో జగన్ పాలనపై అసంతృప్తి తీవ్రంగా కనిపిస్తుండగా..  కాపులలో జగన్ పై ఆగ్రహం పెరిగింది. 

అదే సమయంలో మరోపక్క పార్టీలో అంతర్గత పోరు కూడా తీవ్రమైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వైరం తీవ్రస్థాయికి చేరి రెండు గ్రూపులుగా విడిపోయి ప్రత్యక్ష యుద్దానికి దిగారు. అమలాపురంలో కూడా మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎంపీ చింతా అనూరాథ మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి పంపుతున్న ఎంపీ భరత్ పనితీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పిఠాపురం నుంచి దొరబాబును కాదని ఎమ్మెల్యేగా పోటీకి దింపుతున్న కాకినాడ ఎంపీ వంగా గీతపై కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. అలాగే మరో అరడజను స్థానాలలో కూడా వైసీపీది అదే పరిస్థితి. సరిగ్గా ఇప్పుడు ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. వైసీపీకి కనీస స్థానాలు కూడా దక్కకూడదని పవన్ టీడీపీతో కలిసి పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. 

పవన్ ఇప్పటికే రెండు వారాల కిందట మంగళగిరిలో ఉభయగోదావరి జిల్లాల నేతలతో  సమావేశమయ్యారు. తాజాగా కాకినాడ వేదికగా నియోజకవర్గాల రివ్యూ కూడా చేపట్టారు. కాకినాడ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో విడివిడిగా మాట్లాడారు. న్యాయవాదులు, వైద్యులు, నియోజకవర్గ ప్రముఖులతో కూడా సమావేశమై వారి సలహాలు, సూచనలను తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో కూడా పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఎట్టి పరిస్థితుల్లో ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజలలో వైసీపీపై అసంతృప్తికి తోడు పవన్ దూకుడు చూస్తుంటే అధికార పార్టీలో ఇప్పటికే  కలవరం ప్రారంభమైంది. తెలుగుదేశం, జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడం.. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ  కలిసి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం చూస్తుంటే.. ఈసారి వైసీపీకి ఇక్కడ జీరో స్థానాలే ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
భారత రాజ్యాంగం ప్రకారం.. జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. ఇది ఏ పార్టీ ఇష్టానుసారం చేసే పని కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన, ఆటోమేటిక్ ప్రక్రియ. ఎందుకు 50 సంవత్సరాలుగా డిలే అయింది? 1976 ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ.. డీలిమిటేషన్ను 2001 వరకు ఫ్రీజ్ చేశారు.2001 – వాజ్పేయి ప్రభుత్వం: ఫ్రీజ్ను 2026 వరకు పొడిగించింది. అంటే.. 2026లో డీలిమిటేషన్ జరుగుతుందని అన్ని పార్టీలకూ గత 20 సంవత్సరాలుగా తెలుసు.
ప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు.
ఆయన మంత్రి పదవి ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన గడువుపై ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. నెల రోజుల్లో ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని ప‌రిశీలిస్తే ఆయ‌న‌కా గండం ఉందనే చెప్పాలి.
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.