షర్మిలతో సంధికి వైసీపీ యత్నాలు?

Publish Date:Dec 31, 2023

Advertisement


ఏపీలో కొత్త ఏడాదిలో కొత్త రాజకీయాలు మొదలు కానున్నాయా అంటే అన్ని వర్గాలు అవుననే ముక్తకంఠంతో చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఏపీలోఅసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలూ జరగనున్నాయి. ఈ ఎన్నికలకు జనవరి నుండే సన్నాహాలు మొదలు కానున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండగా.. జనవరిలో దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అయితే, ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఒకవైపు, ప్రతిపక్షంలో తెలుగుదేశం.జనసేన  మరోవైపు  బరిలో నిలవనుండగా.. కాంగ్రెస్ కూడా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సీఎం జగన్ సోదరి   షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖరారైంది. జనవరి మొదటి వారంలోనే షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖరారైపోయింది. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన తరువాత ఏపీ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటే వైసీపీ నుండి భారీ స్థాయిలో వలసలు ఉంటాయని చెబుతున్నారు.

షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకున్నారు. అయితే తెలంగాణలో వైసీపీ లేకపోవడంతో ఇన్నాళ్లు ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఉన్నా జగన్ కు పెద్దగా నష్టం లేకుండా పోయింది. కానీ, ఆమె ఏపీకి వస్తే జగన్ కు భారీ డ్యామేజ్ జరగడం ఖాయం. ఇది వైసీపీకి తీరని నష్టంగా విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాదు, ఒకే రాష్ట్రంలో రెండు వేరువేరు పార్టీలలో ఉంటూ.. అన్నా చెల్లెలు ఎదురు నిలిచి రాజకీయ పోరాటం చేసుకుంటే ఖచ్చితంగా అది జగన్ ప్రతిష్టను మరింత మసకబారుస్తుందని అంటున్నారు. పైగా షర్మిల తన రాజకీయ ప్రయాణంలో జగన్ పై సూటిగా విమర్శలకు దిగితే వైఎస్ కుటుంబంలో వివాదాలు కూడా బహిర్గతం కావడం ఖాయం. ఇవన్నీ రానున్న ఎన్నికలలో వైసీపీకి ఘోర ఓటమికి కారణం కావడమే కాకుండా.. జగన్ ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడం ఖాయం. ఈ నేపథ్యంలో దీనిని దృష్టిలో పెట్టుకొనే షర్మిల కోసం జగన్ అండ్ కో రాయబారాలు మొదలుపెట్టినట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది. వైసీపీలోకి తిరిగి షర్మిలను తీసుకుని వచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్త వైరల్ అవుతోంది. వైఎస్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఒకరు   వైసీపీ తరఫున  షర్మిలతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. షర్మిలకు ఏం కావాలి? ఆమె ఆలోచనలు ఏంటి? ఆమె డిమాండ్లు ఏంటి? అన్నది తెలుసుని మళ్ళీ అన్న జగన్ తో రాజీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆమెను తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా సదరు రాయబారే తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, వైసీపీ నుండి కడప ఎంపీగా షర్మిలను పోటీ చేయించేందుకు కూడా వైసీపీ హై కమాండ్ సుముఖంగా ఉందని, ఆమె రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చడం, ఆస్తులకు సంబంధించిన విషయాలను కూడా సానుకూలంగా పరిష్కరించడానికి   షర్మిలతో సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   అయితే, ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే జగన్ నైజం తెలిసిన వారెవరూ ఆయన  అంత సులభంగా రాజీకి వచ్చే మనిషి కాదనే అంటారు. అదే విధంగా  షర్మిలకు కూడా అన్న జగన్ తో  రాజీకి వచ్చే అవకాశాలు లేవనీ, తెలంగాణలో   అడుగడుగునా ఇబ్బందులు సృష్టించడమే కాకుండా, షర్మిలకు ఆర్థికంగా ఇసుమంతైనా సహకారం అందకుండా జగన్ చేశారనీ, అందుకే  ఆమె ఏపీకి వచ్చి అన్నతో తలపడేందుకు సిద్ధమయ్యారనీ అంటున్నారు. కనుక షర్మిల అన్నతో రాజీపడే అవకాశాలు మృగ్యమని అంటున్నారు.  అసలు ఈ ప్రచారాన్ని జగన్ అభిమానులే సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమై.. మళ్ళీ అన్నా చెల్లెల్లు ఒక్కటి అవుతారనేందుకు ఉన్న ఏకైక పాజిటివిటీ ఏదైనా ఉందంటే అది తల్లి విజయమ్మ మాత్రమే. ఎంతైనా తల్లి కదా మళ్ళీ అన్నా చెల్లెల్లు కలిస్తారంటే తల్లిగా ఆమె పాత్ర ఆమె నిర్వర్తిస్తారు. ఇద్దరినీ ఉన్నతంగా చూడాలన్నదే ఆమె కోరిక కనుక ఆ అవకాశం వస్తే విజయమ్మ ఇందులో కీలకం కానున్నారు. కానీ, జగన్ అంత సులభంగా కరుగుతారా? ఒకేవేళ చెల్లే కదా అని జగన్ తగ్గినా.. వదిన భారతీ అందుకు ఒప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు
యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.
బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.