వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్కు జైలు శిక్ష
Publish Date:Apr 11, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు విశాఖ రైల్వే కోర్టు జైలు శిక్ష విధించింది. దాదాపు ఎనిమిదేళ్ల కిందటి కేసులో ఆయనకీ శిక్ష పడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనను దోషిగా తేల్చిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి, ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2016 ఏప్రిల్ నెలలో విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం అమర్నాథ్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ క్రమంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అప్పట్లో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకుని చికిత్స కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ సందర్భంగా అమర్నాథ్ ప్రాణహాని కలిగించుకునేలా వ్యవహరించారని పేర్కొంటూ అప్పట్లో టూటౌన్ పోలీసులు ఆయనపై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు విన్న రైల్వే కోర్టు, తాజాగా గుడివాడ అమర్ నాథ్ కుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ.. ప్రజల సమస్యల కోసం, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ కోసం తాము చేసిన పోరాటంలో ఇటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం దురదృష్టకరమన్నారు. రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే, దీనిపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పిన గుడివాడ అమర్నాథ్ హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/ycp-leader-gudivada-amarnath-sentenced-to-jail-36-217111.html





