‘పొత్తు’ పొడిస్తే వైసీపీకి చుక్కలే!

Publish Date:May 7, 2022

Advertisement

ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మూడేళ్లలోనే తన పాలనా వైఫల్యాలతో నాడు తనకు మద్దతు పలికిన అన్ని వర్గాలలో అసహనం నింపేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు ఇలా ఏ వర్గం తీసుకున్నా సంతోషంగా లేని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. 
2019 ఎన్నికలలో అంత వేవ్ ఉండి కూడా మెజారిటీల పరంగా వైసీపీ అభ్యర్థులు చాలా వరకూ స్వల్ప మెజారిటీలతోనే గట్టెక్కారు. పైగా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా త్రిముఖ పోటీ నెలకొని ఉంది. జగన్ వ్యతిరేక ఓటు తెలుగుదేశం, జనసేన మధ్య చీలిపోయింది. అప్పట్లోనే 2004 ఎన్నికలలో వలె తెలుగుదేశం, బీజేపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటే వైసీపీకి విజయం అంత సులువు అయ్యుండేది కాదు. 
అన్ని రంగాలలో వైఫల్యాలతో ప్రజాదరణను వేగంగా కోల్పోతున్న జగన్ ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారేలోపే ముందస్తుకు వెళ్లి లబ్ధి పొందాలని యోచన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలన్న ఆశలకు ‘పొత్తు’లతో గండి కొట్టాలని విపక్షాలు స్కెచ్ వేస్తున్నాయి. పొత్తులు కుదిరితే 2019 ఎన్నికలలో వైసీపీకి చుక్కలు కనబడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎలా అంటే  2019లో వైసీపీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రత్యర్థులుగా వేరువేరుగా పోటీ చేశాయి. దీంతో ఓట్ల చీలక వల్లనే వైసీపీ అధికారంలోకి రాగలిగింది. పేరుకు 151 స్థానాలలో విజయం సాధించినా, నిజానికి వాటిలో దాదాపు 80 స్థానాలలో ఆ పార్టీ మెజారిటీ వేయి లోపే.. అంటే ఓట్లు చీలిపోవడం వల్ల వైసీపీ సీట్ల పరంగా భారీగా లాభపడింది. అదే వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటే... 2014 ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలే ఎక్కవ ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు వారు 2019 ఎన్నికల లెక్కలనే ఆధారాలుగా చూపుతున్నారు.  
 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలలో విజయం సాధించింది కానీ భారీ మెజారిటీ వచ్చిన స్థానాలు మాత్రం 60లోపే.  మిగిలిన స్థానాలలో వైసీపీ విజయం వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్లనేనన్నది వారి విశ్లేషణ. మల్లాది విష్ణు కేవలం పాతిక ఓట్ల తేడాతో విజయం సాధించారు.  జనసేన, తెలుగుదేశం పార్టీలు వేరువేరుగా పోటీ చేసిన కారణంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలి తెలుగుదేశం నష్టపోయింది. వచ్చే ఎన్నికలలో పొత్తుల వల్లనే కాకుండా.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల కూడా తెలుగుదేశం ఈ సారి భారీగా లబ్ధి పొందే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు విపక్ష ఓటు చీలకుండా పొత్తులు ఉంటే.. వైసీపీ రెండో సారి అధికారంలోకి రావాలన్న కల సాకారమయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని చెబుతున్నారు. 
అలాగే తెలుగుదేశం పార్టీకి  గట్టి పట్టు ఉన్న ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి గత ఎన్నికలలో దాదాపు స్వీప్ చేసినంత పనైంది. అయితే ఆ ప్రాంతాల్లో మెజారిటీలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయి. ఇప్పడు ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను పరిగణనలోనికి తీసుకుంటే గోదావరి జిల్లాలు; ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వపు ఆదరణ ఉండే అవకాశాలు దాదాపు మృగ్యమనే అంటున్నాయి. ఎలాగూ అక్కడ గట్టి పునాది ఉన్న తెలుగుదేశం పూర్వవైభవం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయనీ, దానికి ‘పొత్తు’ బలం కలిస్తే ఎదురే ఉండదనీ అంటున్నారు.  అదే జరిగితే ఈ సారి ఎన్నికలలో 2019 ఎన్నికల నాటి సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

By
en-us Political News

  
నియోజకవర్గాల పెంపు కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ బలం మరింత దిగజారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భారీగా ఆర్వోల తొలగింపు వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని పశ్చిమబెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఒకే సారి 72 మంది ఆర్వోలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించిదే తప్ప అదుకు కారణాలను వెల్లడించలేదు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి.
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.