జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ ప్రజల మధ్య కులచిచ్చు పెడుతోందని ఘాటుగా విమర్శించారు. కులం పుట్టుకతో వచ్చేదే తప్ప ఎంపిక కాదన్న నాగబాబు.. అభివృద్ధి జరగాలంటే.. అధిక సంఖ్యలో ఉన్న కులాల వారు అల్ప సంఖ్యలో ఉన్న కులాల వారికి అండగా నిలవాలన్నదే జనసేనాని పవన్ కల్యాణ్ భావన అని చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలో కొతతార రామకృష్ణ విజయమే ఇందుకు నిదర్శనంగా చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో నలభై శాతం ఉన్న కాపు సామాజిక వర్గానికి కాకుండా గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాలకు జనసేన టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని నాగబాబు గుర్తు చేశారు. అంతే కాకుండా వైసీపీకి సూటిగా ఐదు ప్రశ్నలు సంధించి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
2024 ఎన్నికల్లో కాపులు, బలిజలు ఎక్కువగా ఉండే, రాయలసీమ ప్రాంతంలో వైసీపీ కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చింది? 2014లో కాపుల కంచుకోట అయిన రాజంపేటను మిథున్ రెడ్డికి కట్టబెడుతుంటే.. కాపు సామాజిక వర్గానికి తామే లయన్, టైగర్ అని జబ్బలు చరుచుకుంటున్న అంబటి రాంబాబు, పేర్ని నాని ఎక్కడ తలదాచుకున్నారు? వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాను పార్టీ నుంచి బయటకు పంపి.. రంగాను దూషించిన గౌతమ్ రెడ్డికి ఫైబర్ నెట్ పదవి ఇస్తుంటే వీరంతా ఏం చేస్తున్నారు? పిఠాపురంలో పవన్ ని ఓడించడానికి మిథున్ రెడ్డిని పంపి.. అదే పవన్ని తిట్టడానికి మాత్రం పేర్ని వంటి వారిని జగన్ ఎందుకు ప్రయోగిస్తుంటారు? కాపు నేస్తం పథకానికి వైయస్ పేరు పెట్టడమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నాగబాబు సవాల్ చేశారు. ముందు ఈ ప్రశ్నలకు బదులిచ్చిన తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ ను నిలదీయాలని వైసీపీలోని కాపు నేతలను నాగబాబు చాలెంజ్ చేశారు.
వైసీపీ వారికి నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుందన్న శాపముందని.. అందుకే వారు ఏ విషయంలోనూ నిజాలు చెప్పరనీ నాగబాబు పేర్కొన్నారు. ఇది అసలే జెన్ జీ కాలం.. యూత్ ఏఐ తో యమ వేగంగా ఉందన్న నాగబాబు.. ఇంకా రాంబాబు వంటి వారు పాత కాలపు రాజకీయాలు చేస్తూ జనంలో కుల చిచ్చు రగలుస్తామంటే చూస్తూ ఊరుకోరని వార్నింగ్ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-caste-politics-wouny-work-25-213730.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.