తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ విషయంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్ నివేదిక తరువాత వైసీపీ చేస్తున్న వాదనను ఆ పార్టీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డే ఖండిస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ అంతా ఒక వైపు.. జగన్ కు సమీప బంధువు కూడా అయిన వైవీ సుబ్బారెడ్డి ఒక్కరూ మరోవైపు అన్నట్లుగా పరిస్థితి తయారైంది.
దీంతో నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది అంటూ వైసీపీ అధినేత జగన్ నుంచి ఆ పార్టీ మొత్తం చేస్తున్న వాదన ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరగలేదంటూ సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ ఊరూ వాడా ప్రచారం చేస్తుంటే.. వైవీ సుబ్బారెడ్డి మాత్రం తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నిర్థారించిన మాట వాస్తవమేనని బాహాటంగా అంగీకరించేశారు. దీంతో వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది.
వాస్తవానికి సిట్ చార్జిషీట్ లో నెయ్యి కల్తీకి సంబంధించిన ఆధారాలును స్పష్టంగా పేర్కొంది. లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదనీ, రసాయనాలతో కలిపిన సింథటిక్ నెయ్యిని, పామాయిల్ సహా ఇతర నూనెల మిశ్రమాన్ని వినియోగించినట్లు సిట్ చార్జిషీట్ పేర్కొంది. ఇక్కడే వైసీపీ కల్తీ జరిగిందన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తూ.. చంద్రబాబు చెప్పినట్లు జంతువుల కొవ్వు కలవలేదంటూ నానా హడావుడీ చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టాలని చూసింది. అయితే వైసీపీ పప్పులు ఉడకలేదు. స్వయంగా జగన్ సమీప బంధువు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగింది.. ఆ విషయాన్ని సిట్ ధృవీకరించింది అని కుండబద్దలు కొట్టేశారు.
అయితే అందుతో తమ తప్పేమీ లేదు, అధికారులు , ధర్డ్ పార్టీ వ్యక్తుల వల్ల ఈ కల్తీ జరిగిందని ఆయన అశ్వద్ధామ కుంజర: అన్న తీరుగా వ్యాఖ్యలు చేశారు. అయితే కల్తీ జరిగిందని వైవీ ధృవీకరించి, కల్తీ జరగలేదన్న జగన్ వాదనను పూర్వపక్షం చేశారు. తద్వారా జగన్ కు, వైసీపీకి దిక్కుతోచని పరిస్థితి కల్పించారు. ఇప్పటివరకు తాము చేస్తున్న నిర్దోషిత్వం ప్రచారాన్ని సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మనే పటాపంచలు చేయడంతో ఒక్క సారిగా కంగుతిన్నారు. వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకోలు.. వైసీపీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-one-side-and-yv-otherside-25-213728.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.