Publish Date:Oct 22, 2022
రాజకీయాలు రోజురోజుకీ విమర్శల నుంచి దాడులకి దిగజారుతోంది. ప్రత్యర్ధులు చేసిన కామెంట్లను చాలా సీరియస్గా తీసుకుని ఏకంగా వారి నాయకులు లేదా పార్టీ కార్యాలయాల మీదా దాడులకు వెను కాడటం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన కార్యాలయం మీద కొందరు వ్యక్తులు దాడి చేసి ఫర్నీచర్ని ధ్వంసం చేసి భయభ్రాంతులు కల్పించారు. కాగా వారు తప్పకుండా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరులే అని స్థానిక జనసేన పార్టీ నాయకులు అంటున్నారు.
మూడురోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్య లు చేశారు. ఇందుకు టెక్కలి ప్రాంత జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. శుక్రవారం జరి గిన దాడి తప్పకుండా వారే చేయించారని ఆముదాలవలస నియోజకవర్గ జనసేన ఇన్చార్ఝ రామ్మెహన్ శ్రీకా కుళంలో ఏ ఎస్పీ శ్రీనివాస్ని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన వారు తమ పార్టీ కార్యాల యంపై దాడి చేసారని….వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరో వైపు జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి స౦బ౦ధించి టెక్కలి నియోజకవర్గ బీజేపీ నాయకులు స్ప౦ది చారు. జనసేన పార్టీ కార్యాలయంకి వెళ్లి జనసైనికులకు స౦ఘీభావ౦ తెలిపారు.
తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు వరుసగా పవన్ పై విమర్శలతో దాడికి దిగుతున్నారు. తాజాగా జనసేన కార్యాల యం పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. అయితే ఇటీవలి కాలంలో విపక్షాలపై బూతు పురాణంతో విరుచుకు పడుతూ, ఏమాత్రం సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నది వైసీపీ నాయకులేనని విపక్షాల ఆరోపణ. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్టు కోల్పోవడం, వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం సన్నగిల్లడంతోనే ఈ తరహా దాడులకు దిగుతున్నా రన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-attacks-on-janasena-office-25-145874.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!