పవన్ కల్యాణ్ క్లారిటీతో వైసీపీ నేతల్లో గాభరా
Publish Date:Jan 15, 2023
Advertisement
పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు తన గౌరవానికి భంగం కలగనంతవరకూ పొత్తులతోనే ముందుకు వెళతానన్న స్పష్టత ఇచ్చేశారు. అంటే తెలుగుదేశం, జనసేనలు వచ్చే ఎన్నికలలో కలిసే వెళతారన్నది స్పష్టమైపోయింది. ఇక ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లెం ఆశతోనే అని ఆయనకు ఎంత వరకూ అర్ధమైందో తెలియదు కానీ.. ఆయన పార్టీలోని నాయకులకు మాత్రం స్పష్టంగా అర్ధమైంది. అందుకే జగన్ పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని, గెలుస్తామనీ పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే యత్నాలు చేస్తున్న.. మనసులో ఆందోళన ఉన్న పైకి అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నా.. పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఎలాంటి కదలికా రావడం లేదు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు. నిజంగా ప్రతి గాడకు మేలు జరిగిందే నిజం అయితే, గడపగడపలో ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. నిజంగా మనం మేలు చేస్తే ఇంతలా హైరాన పాడడం ఎందుకు? అంటూ పార్టీ నేతలూ, కార్యకర్తలు గొణుక్కుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని, చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని భూతద్దంలో చూపించి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని, 175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం, అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు, తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు. నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం భరోసా కనిపించడం లేదు. గతంలో, అభ్యర్ధి ఎవరైనా, `అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం! అని అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉంది పోతున్నారు. జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన కార్యకర్తఃలు చాలా వరకూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. 98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డానం చేయించానన్నట్లు ఉందని సొంత పార్టీ అధినేతపైనే సెటైర్లు వేస్తున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని, నేతలను నడిరోడ్డు మెదే నిలదీస్తున్నారు. అలాగే, కులం, మతం ఇతర కారణాలతో ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తఃలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగించి ఎమీ లేదని, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు. ఇక ఇప్పుడు ఏం చేసినా చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడమేనని అంటున్నారు. కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే.. పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి జ్వలిస్తోంది. ఇంత కాలం అణచిపెట్టుకున్న అసంతృప్తి ఇప్పుడు భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలో తూటా దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరంతా కూడా ఒకరిద్దరు మినహా అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొనితెచ్చుకున్నవారే.అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే.. ఇప్పుడు వీరికిప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వారికి మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధి లేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి.నిజానికి, జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్ని వైసీపీ నాయకులూ కార్యకర్తలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు. నిజానికి ఇప్పటికే చాల వరాకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు ఊపందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటుందని, వైసీపీ ముఖ్య నేతలే అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు వెనకాడుతున్నారు. ఒక వేళ తీసుకెళ్లినా ప్రయోజనం ఏముంది అని మిన్నకుంటున్నారు.
ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మానుగుంట మహీధర్రెడ్డి, గుంటూరులో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తాడికొండ ఉండవల్లి శ్రీదేవిచ కర్నూలు ఎస్వీ మోహన్రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) రాజంపేట మేడా మల్లికార్జున రెడ్డి రాయచోటి శ్రీకాంత్రెడ్డి గిద్దలూరు అన్నా రాంబాబు బాపట్ల కోన శశిధర్ శ్రీకాకుళం కిల్లి కృపారాణి పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
http://www.teluguone.com/news/content/worry-in-ycp-39-150022.html





