Publish Date:Oct 26, 2024
కూటమి పార్టీల మధ్య సమన్వయం చాలా ముఖ్యం అని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గుంటూరు, కృష్ణా జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ లను ప్రకటించామన్నారు. ఈ అభ్యర్థుల ఎంపికలో ఆ నాలుగు జిల్లాలలోని నేతల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్నామన్నారు.
గ్యాడ్యుయేట్ల ఓట్ల నమోదు విషయంలో పూర్తి శ్రద్ధపెట్టాలని సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలన్నారు. కూటమి నేతలతో కోఆర్డినేషన్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఇటీవలి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో 93శాతం స్థానాలలో విజయం సాధించడానికి కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగడం కారణమని చంద్రబాబు వివరించారు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా రేయింబవళ్లు పని చేస్తున్నామన్న ఆయన పని చేయడం ఎంత ముఖ్యమో దానిని ప్రజలలోకి తీసుకువెళ్లడం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వంలో ఉండి పనులు చేయడమే కాదు ఆ పనుల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం కూడా ముఖ్యమన్నారు. కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఈ నాలుగు నెలల్లో ప్రజల కోసం తీసుకువచ్చిన విధానాలు, పథకాలపై ప్రజలలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికే డీఎస్సీ ప్రకటించాం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను తీసుకొచ్చేందుకు 6 పాలసీలు తీసుకొచ్చాం. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని జాబ్ ఫస్ట్ విధానంతో ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తున్నాం. అలాగే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు సాగుతున్నారు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణకు శ్రమిస్తున్నాం. వీటన్నిటినీ ప్రజలకు వివరించాలని అన్నారు. విజయవాడ వరద బాధితులకు ఎప్పుడూ లేని విధంగా దెబ్బతిన్న ఒక్కో ఇంటికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించాం. వీటన్నిటినీ ప్రజలలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు చెప్పారు. ఇక ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ మంచి మెజారిటీతో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పని చేయాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/work-with-coordination-25-187447.html
ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్యూఆర్ కోడ్తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాది కొత్తగూడెంలో పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందజేశారు.
తొలి ఏకాదశి సందర్బంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే నమ్మకంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చాయి.
నెల్లూరులోని ప్రసిద్ద బారాషషీద్ దుర్గ వద్ద రొట్టెల పండుగ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరిగే పాటు జరగనున్నది.
పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్న పార్టీలో ఉన్నట్టు ఉండి ఉంటే వీళ్ల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే కరవడంతో పాము, మొసలినే మించి పోయారీ ఇద్దరూ. కారణం ఈ భూ ప్రపంచంలో పెట్టిన చేతినే కరిచే బుద్ధి కేవలం పాము, మొసలికి మాత్రమే ఉంటుందట.ఆ
క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.
హైదరాబాద్ నడి బొడ్డున 1982 మార్చి 29న పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీఆర్ఎస్ అయినా పుట్టిన పుష్కర కాలానికిగానీ అధికారంలోకి రాలేదు. అదే టీడీపీ ఏకంగా 9 నెలల్లోనే అధికారం చేపట్టి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే మరెవరికీ సాధ్యం కాని ఒక చరిత్రను సృష్టించింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్చ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ తెలిపారు.
ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు.