జీవితం మీద యాసిడ్

Publish Date:Mar 7, 2016

Advertisement

 

అదో సినిమా! అందులో అల్లరి చిల్లరిగా తిరిగే కథానాయకుడు. ఆయనగారు పొద్దున లేస్తూనే బూతులు, రాత్రవగానే మందు... ఈ రెండింటి మధ్య అల్లరి చిల్లరి తిరుగుళ్లతో జీవితాన్ని మగమహారాజులా గడిపేస్తూ ఉంటాడు. అలాంటి అద్భుతమైన జీవికి ఓ ఆడతోడు కావాల్సి వస్తుంది. తను అప్పుడప్పుడూ వెళ్లే కాలేజీలో, తనకి ప్రియురాలు కాగలిగిన ఉత్తమురాలు ఎవరా అని వెతుకుతుండగా, ఓ చదువుల తల్లి కనిపిస్తుంది. ఇక ఆమె వెంటపడటం మొదలుపెడతాడు మన హీరో! ఆ అమ్మాయి హీరో వంక చూడదు. అయినా ఇతగాడు వదలడు. వెంటపడుతూనే ఉంటాడు. తను ఛీ పొమ్మన్నా ద్వంద్వార్థాలతో వేధిస్తూనే ఉంటాడు. అదేం చిత్రమో కానీ ఆ అమ్మాయి ఇతగాడి ప్రేమలో పడిపోతుంది. ఎందుకంటే అది సినిమా కదా! కానీ నిజజీవితం ఇలా ఉండకపోవచ్చు. ఇలాంటి పోకిరీ కుర్రాడిని చూసిన అమ్మాయికి అతగాడితో ప్రేమన్నా, పెళ్లన్నా వెగటు పుట్టి ఉండవచ్చు. మరీ చిరాకేస్తే పోలీస్‌ కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు. దానికి నిజజీవితంలో కుర్రవాళ్లు ప్రవర్తించే తీరు కూడా భిన్నంగా ఉంటోంది. తన మనసుకి నచ్చిన అమ్మాయి నచ్చలేదన్న అక్కసుతో కొందరు తీసుకునే నిర్ణయం అవతలి మనిషి జీవితాన్నే చీకటిగా మార్చేస్తోంది. ఈ ఉపోద్ఘాతమంతా యాసిడ్‌ దాడుల గురించి అని వేరే చెప్పాలా!

2015లో మనదేశంలో 300కి పైగా యాసిడ్‌ దాడులు నమోదయ్యాయి. ఇక నమోదు కాని కేసులు వీటికి రెట్టింపు ఉండవచ్చని ఒక అంచనా! వీటిలో అధికశాతం దాడులు ఆడవారి మీదే జరిగాయి. అది కూడా 20 ఏళ్ల లోపువారి మీదే. వీటిలో అధికశాతం దాడులు జరగడానికి కారణం, సదరు అమ్మాయి తనకు లొంగలేదన్న అక్కసే కారణం. సామాన్యంగా ఏదన్నా ప్రమాదం సంభవిస్తే దాని మొదలు నుంచి తుది వరకూ ఏం చేస్తే బాగుంటుంది అన్న ఒక అవగాహన మన పెద్దలకు ఉంటుంది. కానీ యాసిడ్‌ దాడి తీరు వేరు! యాసిడ్‌ మీద పడటం అనేది ఒక హఠాత్పరిణామం! అది మన మీద పడిన వెంటనే ఎలాంటి ప్రథమచికిత్స తీసుకోవాలి. ఏ వైద్యుడిని సంప్రదించాలి అన్న అయోమయం ఒక పక్కన ఉంటే, శారీరిక నరకం కూడా యాసిడ్‌ చుక్క ఒంటి మీద పడిన క్షణం నుంచే మొదలవుతుంది.

పువ్వు రెక్కల మీద పడిన నిప్పు దాన్ని కాల్చివేసినట్లు, యాసిడ్‌ శరీరాన్ని కరిగించివేసే ఒక నిప్పు కణిక. అది మన శరీరంలోపలికి చొచ్చుకుపోతుంది. యాసిడ్‌ పడ్డాక చూపు పోవచ్చు; కనురెప్పలు కరిగిపోవచ్చు; గొంతు మీద పడితే శ్వాసనాళం దెబ్బతినిపోవచ్చు; జుత్తు శాశ్వతంగా మండిపోవచ్చు; పెదాలు, నాలిక, ముక్కు... ఇలా యాసిడ్ చుక్క పడిన ప్రతి అవయవం తన జీవాన్ని కోల్పోతుంది. అవతలి మనిషి తనకు దక్కలేదన్న అక్కసు, ఒక బతుకుని చీకటిగా, బతికే చీకటిగా మార్చివేస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఒకపక్క శాశ్వతంగా ముఖకవళికలు దెబ్బతినిపోగా, అంతకంత మానసికమైన వేదనని కూడా అనుభవించాల్సి వస్తుంది. యాసిడ్‌ దాడికి గురైన వ్యక్తిని బాధితురాలిగా చూసి ఆదరించాల్సిన సమాజం, వెలివేసే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కుటుంబసభ్యులు ఆదరించి వెన్నంటి ఉన్నా, బయట అడుగుపెడితే ప్రతి ఒక్కరి చూపూ ఆమె గాయాలని వెంబడిస్తూనే ఉంటాయి. అలాంటివారిని ఉద్యోగంలోకి చేర్చుకునేందుకు కానీ, తమలో కలుపుకునేందుకు కానీ ప్రతిఒక్కరూ వెనుకడుగు వేస్తూనే ఉంటారు.

ఒక పక్క శారీరికంగా, మానసికంగా వేదన పడుతూనే యాసిడ్‌ బాధితులు న్యాయం కోసం పోరాడవలసి ఉంటుంది. ‘ఇప్పటికే ఇలా చేశాడు. కేసు పెడితే ఇంకే చేస్తాడో!’ అన్న సలహాలు వీరిని వెంబడిస్తూనే ఉంటాయి. అసలే సమాజంలో మొహం చూపించుకోవాల్సిన పరిస్థితిలో లేని తాను, నిరంతరం కోర్టు గుమ్మాల చుట్టూ తిరిగే ధైర్యం చేయలేక చేయలేక, చాలామంది పోలీసు కేసు పెట్టేందుకు కూడా వెనుకంజ వేస్తుంటారు. పైగా నిరుద్యోగం, స్త్రీ పురుష వివక్ష ఎక్కువగా ఉన్న సమాజాలలోనే యాసిడ్‌ దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బంగ్లాదేశ్‌, ఇండియా, పాకిస్తాన్‌ వంటి దేశాలలో గత దశాబ్దంలో వేల కొద్దీ యాసిడ్‌ దాడులు జరగడమే దీనికి సాక్ష్యం. అలాంటి సమాజాలలో బాధితురాలికి ఎలాంటి అండ లభిస్తుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త మారుతూ ఉండటం కాస్త సంతోషించదగ్గ పరిణామం. ‘acid survivors trust international’, ‘acid survivors foundation’ వంటి సంస్థలు యాసిడ్‌ బాధితులకు అండగా నిలుస్తున్నాయి. యాసిడ్‌దాడిలో బాధితులైనవారు కూడా సమాజానికి ఎదురొడ్డి జీవించేందుకు సాహసిస్తున్నారు. తాము ఓడిపోలేదని రుజువు చేసుకుంటూనే, తమలాంటి బాధితులకి సైతం చేయందించేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజ్‌మహల్‌ సమీపంలో ఇలాంటి యాసిడ్‌ బాధితులు కొందరు కలిసి ఏకంగా ఒక కాఫీషాప్‌నే (Sheroes Hangout) పెట్టడం ఇందుకు ఓ మంచి ఉదాహరణ.

యాసిడ్‌ దాడులలోని తీవ్రతను గ్రహించిన పార్లమెంటులు పదునైన చట్టాలను ప్రవేశపెట్టేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో 2013లో మార్పుచేసిన 326A అధికరణాన్నే తీసుకుంటే, యాసిడ్ దాడికి పాల్పడేవారికి కనీసం పదేళ్ల కఠినకారాగారశిక్షను విధించాలని నిర్ణయించారు. నగల షాపుల్లోనో, వాహనాలను రిపేరు చేసే చోట్ల అతి సులువుగా దొరికే సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, నైట్రిక్‌ యాసిడ్లను ఇక మీదట ఏదన్నా గుర్తింపు పత్రం ఉంటే తప్ప అమ్మరాదని న్యాయమూర్తులు 2013లో ఇచ్చిన ఒక తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్‌లో అయితే, యాసిడ్‌ దాడులతో విసిగిపోయిన ప్రభుత్వం, ఈ దాడులకు పాల్పడే నేరస్తులకు ఏకంగా మరణశిక్షను విధించేలా చట్టానికి తగు సవరణలు చేసింది.

కానీ ఎవరెన్ని చట్టాలు చేసినా, ఆ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.... అవన్నీ క్షణికావేశంలో ఉన్న యువతను తప్పు చేయకుండా ఆపగలవని ఆశించలేం! మగపిల్లవాడు పుట్టిన దగ్గర్నుంచీ అతని తల్లిదండ్రులు, చదువు, సమాజం, సినిమాలు.... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆడపిల్ల మగవాడికంటే తక్కువనీ; గొడవ వచ్చినప్పుడు ఆడది, మగవాడి మాట వినాలనీ; మగమహారాజులు ఏం చేసినా చెల్లిపోతుందనీ నూరిపోసినంత కాలం పిల్లవాడు అంతకంటే గొప్పగా ఆలోచిస్తాడని భావించలేం. కాబట్టి యాసిడ్‌ దాడిలో బాధితురాలు ఎవరో ఒక యువతి మాత్రమే కాదు! అది స్త్రీ జాతి మీద జరిగే దాడి. నేరస్తుడు కేవలం ఒక మగవాడు మాత్రమే కాదు! అతను అక్కసుతో, అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ఆధిపత్య ధోరణికి ప్రతిబింబం. ఈ పరిస్థితులో మార్పు రానంతవరకూ.... యాసిడ్‌ దాడులు జరుగుతూనే ఉంటాయి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.