ఈ ఎన్నికలలో గెలిచేది ఎవరు!

Publish Date:Mar 4, 2016

Advertisement

 

కొంతకాలంగా దేశమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్‌ 4 నుంచి మే 19 వరకూ సాగే ఈ ప్రక్రియలో మే 19 నాటికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరిలలో జరిగే ఈ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాలలోని వివిధ పార్టీల విజయావకాశాల మీద ఒక విహంగ వీక్షణం!

పశ్చిమబెంగాల్‌

ఎన్నికల సంఘం తన కార్యాచరణను ఇలా విడుదల చేసిందో లేదో, మమత అలా తన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేశారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సొంతంగానే ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయడం నిజంగానే మమతకు కలిసొచ్చే విషయం. కానీ ఈ జాబితాలో శారదా స్కాంలో పీకల్లోతు మునిగిపోయి ప్రస్తుతం జైల్లో ఉన్న మదన్‌ మిత్రాకు చోటు కల్పించడంతో, ప్రతిపక్షాలు విమర్శించేందుకు తగిన అవకాశం దక్కినట్లైంది. అయితే మమతను విమర్శించేందుకు శారదాస్కాం తప్ప మరేమీ పెద్దగా అంశాలు లేకపోవడం వారి దురదృష్టం! పశ్చిమ బెంగాల్లో మమత అద్భుతమైన పురోగతిని సాధించనప్పటికీ, 30 ఏళ్లకు పైగా ఆ రాష్ట్రాన్ని పాలించిన సీపీఐ(ఎం)తో పోల్చుకుంటే పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయన్నది జనాభిప్రాయమే! ఆ అభిప్రాయమే మమతను ఈసారి కూడా గెలిపించనున్నదన్నది విశ్లేషకుల అంచనా!

తమిళనాడు

ఒకసారి డిఎంకేకీ మరోసారి అన్నాడిఎంకేకి దఫాలవారీగా అధికారాన్ని కట్టబెట్టే తమిళతంబిలు, ఈసారి తమ సంప్రదాయాన్ని సడలించి పురుచ్చితలైవికి పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. జయ విరోధి కరుణానిధి కురువృద్ధునిగా మారిపోవడం, స్టాలిన్‌ తప్ప మరో జనాకర్షణ ఉన్న నేత వారసునిగా లేకపోవడం డీఎంకేకు లోటుగానే ఉంది. పైగా అన్నాడీఎంకే  పార్లమెంటులో 2G స్కాంను తిరిగి లేవనెత్తడంతో ఈసారి కూడా అదే ఆయుధంతో ఇటు డీఎంకేనీ, అటు కాంగ్రెస్‌నీ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ వ్యూహాత్మకంగా తిరిగి రాజీవ్‌ హంతకుల క్షమాభిక్ష అంశాన్ని లేవనెత్తడంతో, అతివాద తమిళుర మనసు కూడా ముందస్తుగా గెల్చుకున్నట్లైంది. గత ఎన్నికలలో మిక్సీల మొదలుకొని ల్యాప్‌టాప్‌ల వరకూ ఉచితంగా ప్రకటించిన వరాలన్నీ జయ అందించడంతో, ఈసారి కూడా ఆమె అందించే వరాల కోసం కొందరు ఓటర్లు ఎలాగూ సిద్ధంగా ఉంటారు. మరి ‘జయ’కేతనం ఎగరక ఏమవుతుంది.

కేరళ

ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఊమెన్ చాందీ, సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోయి ఉన్నారు. ఈ కేసులో నిందితురాలైన సరిత, సోలార్ స్కాంకి సంబంధించి రోజుకో చెంబుడు బురదను చాందీ మీద కుమ్మరిస్తున్నారు. విదేశీయానాలు, వివాహేతర సంబంధాలు, అక్రమ సంపాదనలు, హత్యలు.... ఇలా సోలార్‌ స్కాం చుట్టూ అల్లుకుంటున్న కథలు సురేష్‌గోపీ నటించే అపరాధ పరిశోధక చిత్రాలకంటే చిత్రంగా సాగుతున్నాయి. దీంతో పోయిన ఎన్నికలలో అధికారాన్ని తృటిలో కోల్పోయిన వామపక్ష కూటమి, ఈసారి విజయతీరాలను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తోస్తోంది.

అసోం

చిన్న రాష్ట్రమైనా కూడా ఈశాన్య భారతంలో రాజకీయంగానూ, భౌగోళికంగానూ కీలకమైన రాష్ట్రం అసోం. ULFA, NDFB వంటి అతివాదుల ప్రాబల్యం ఎక్కువైనప్పటికీ, కాంగ్రెస్‌ నేత తరుణ్‌గొగోయ్‌ 15 సంవత్సరాలుగా ఎలాగొలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెగ్గుకొచ్చారు. అయితే బీజేపీ కూడా నిదానంగా అసోంలో బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌నుంచి వస్తున్న అక్రమశరణార్థుల సమస్య, హిందుత్వ ఎజెండాతో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఆ పార్టీ తరఫున సర్బానంద సోనోవాల్‌కు కాస్తో కూస్తో జనాకర్షణ కూడా ఉండటంతో ఈసారి బీజేపీ అక్కడ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా కాంగ్రెస్‌, బీజేపీలు నేరుగా తలపడే రాష్ట్రం మాత్రం అసోమే! ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం రెండు పార్టీలకీ ప్రతిష్టాత్మకంగా మారనుంది. అందుకే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే రాహుల్‌ నేరుగా అసోంకి ప్రయాణమయ్యారు. ఎన్నికలు ముగిసే దాకా దిల్లీ పెద్దలు ఒకరి తరువాత ఒకరు రాహుల్‌ బాట పడతారనడంలో సందేహం లేదు!

పుదుచ్చేరి

పుదుచ్చేరికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌.రంగస్వామికి అక్కడ ఉన్న జనాదరణ అసామాన్యం. అందుకే తన పేరులోని పొడి అక్షరాలతోనే All India N R Congress అంటూ 2011లో ఒక పార్టీని పెట్టినా, పార్టీ పెట్టిన మూడు నెలల్లోనే ఎన్నికలలో జయభేరి మోగించారు. అప్పట్లో అన్నాడీఎంకే స్నేహహస్తం కూడా రంగస్వామికి కలిసివచ్చింది. కానీ ఈసారి పొత్తులు మారేట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి దగ్గరగా ఉన్నా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా... డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ఈ కలను భగ్నం చేసేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. మరి ఈసారి అన్నాడీఎంకే రంగస్వామితో కలిసి పనిచేస్తుందా, లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా చూడాల్సిందే!

దేశంలోని అయిదు ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలకి సంబంధించి ఇది ఒక ముఖచిత్రం మాత్రమే! మే 19నాటికి తుది ఫలితాలు వెల్లడయ్యే నాటికి ఈ ఘట్టం మరిన్ని మలుపులు తిరగడం ఖాయం. అనుకున్నదే జరుగుతుందో, అనుకోనిది ఎదురుపడుతుందో... వేచి చూడాల్సిందే!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.