విజయసాయి హితోపదేశ వేణుగానాలు జగన్ చెవికెక్కుతాయా?

Publish Date:Jan 21, 2026

Advertisement

అత్యంత శ‌క్తిమంత‌మైన  కోట‌రీ ఉండి  కూడా ప్ర‌జ‌లు ఎన్నుకున్న బ‌ల‌మైన  ప్ర‌భుత్వాధినేత అయిన వెనిజువెలా అధ్య‌క్షుడు మ‌దురో ని అమెరికా సేన‌లు, ఆయ‌న సతీమణితో సహా ఆయన నివాసంలోనే  బంధించి తీస్కెళ్తుంటే ఎలాంటి ప్ర‌తిఘ‌ట‌న ఎదురు కాలేదు.. ప్ర‌జా జీవితంలో ఉండే  నాయ‌కులు కోట‌రీలు అమ్ముడు పోవ‌డం వ‌ల్లే.. ఇలాంటి దుస్థితిని ఎదుర్కుంటారు అనే అర్ధం వచ్చేలా మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అన్నిటికీ మించి మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు విజయసాయి హాజరు కావడానికి రోజుల ముందు ఆయనీ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. 

ఎందుకంటే విజయసాయి కామెంట్స్ లోని రెండు అంశాలు ఇక్క‌డి నేటివిటీని క‌నెక్ట్ చేశాయి. అందులో మొద‌టిది జ‌గ‌న్ కాగా.. రెండోది ఆయ‌న చుట్టూ ఉన్న కోట‌రీ.   ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. విజయసాయి జగన్ కు అత్యంత సన్నిహతులలో ఒకరు. సరే అది గతం అంటారా, ఓకే.  కానీ జ‌గ‌న్ సంప‌ద‌ను మ‌దుపు చేయ‌డం మాత్ర‌మే కాక‌.. ఇప్ప‌టికీ ఎలాంటి ఇబ్బంది రావడం లేదంటే.. దాని వెనుక ఉన్న శక్తి, యుక్తి విజయసాయిదే.  జ‌గ‌న్ పార్టీ నుంచి  అన్ని ప‌ద‌వుల  నుంచి విజ‌య‌సాయి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. కాబ‌ట్టి ఆయ‌నకు జ‌గ‌న్ తో ఎలాంటి  స‌త్సంబంధాలు లేవ‌ని అంతా భావిస్తుంటారు. కానీ,  ఇప్పటికీ  జ‌గ‌న్ ఆస్తిపాస్తుల వివ‌రాలు, లెక్కా ప‌త్రాలు, జ‌మాఖ‌ర్చుల‌ను చూస్తోంది సాయిరెడ్డి టీమే. సాయిరెడ్డి కేవలం  రాజ‌కీయంగా మాత్ర‌మే జగన్ కు దూరమయ్యారు తప్ప,   జ‌గ‌న్ తో వ్యక్తిగత, ఆర్థిక సంబంధాలు ఇసుమంతైనా దెబ్బతినలేదని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రాజకీయం వేరు.. విజయసాయి రెడ్డి వృత్తి అదే చార్టెడ్ అక్కౌంటెంట్ వేరు.  

విజ‌య‌సాయిరెడ్డి చెబుతున్న  కోట‌రీ విషయానికి వస్తే... ఆయ‌న గ‌తంలో పార్టీకి ఎంత కీల‌కంగా  ప‌ని చేశారో  చూడాలి. సొమ్మొక్కరిదీ, సోకొకరిదీ  అన్న‌ట్టు 2019లో వైసీపీ విజయం వెనుక విజ‌య‌సాయిరెడ్డి పాత్రే కీల‌కం.   చంద్ర‌బాబు గురించి అలెర్ట్ చేస్తూ స్వ‌యంగా త‌న  వాయిస్ రికార్డ్ చేస్తూ దాన్ని  కూడా వైర‌ల్ చేసి.. ఎట్ట‌కేల‌కు అనుకున్న ల‌క్ష్యం సాధించ గ‌లిగారు. అయితే ఇవేవీ  గుర్తించ‌ని జ‌గ‌న్ విజ‌య‌ సాయి  అప్ప‌టికీ- ఇప్ప‌టికీ-  ఎప్ప‌టికీ  తన ఛార్టెడ్ అక్కౌంటెంటే.. అన్నట్లుగా లైట్ తీసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విజయసాయిని కేవలం తన గుమస్తా అన్నట్లుగా జగన్ ట్రీట్ చేశారు. ఈ తరువాత సకలశాఖల మంత్రి స‌జ్జ‌ల ఎంట్రీతో.. విజ‌య‌సాయిని పూర్తిగా  ప‌క్క‌న  పెట్టేశారు. సరే తరువాత 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే ఆ పరాజయం తరువాత కూడా జగన్ విజయసాయిని రాజకీయంగా దగ్గరకు తీయలేదు. ఈ నేపథ్యంలోనే విజయసాయి వైసీపీకి దూరమయ్యారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసి.. వ్యవసాయమే తన వ్యాపకం అంటూ రాజకీయ సన్యాసం ప్రకటించేశారు.

అంతే కానీ ఎక్కడా జగన్ పై విమర్శలు చేయలేదు. కానీ జగన్ కోటరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు, హెచ్చరికలూ మాత్రం చేస్తున్నారు. ఇప్పటికి కూడా  ఆయన వెనిజువేలా అధ్యక్షుడి ఉదంతాన్ని ఉటంకిస్తూ.. ఈ అమ్ముడు పోయిన  కోట‌రీ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా  ఉండ‌మ‌ని  జగన్ శ్రేయస్సు కోరే హెచ్చరిం చారంటే.. విజయసాయి స్వామి  భ‌క్తి  ఏ  పాటిదో అర్ధం చేసుకోవ‌చ్చంటున్నారు.  కోట‌రీ ఎంత బ‌ల‌మైన‌దో ఇప్పుడు విజయసాయి చెబుతున్నారు కానీ,   గతంలో నే  మేక‌పాటి  రాజ‌మోహ‌న్ రెడ్డి కూడా చెప్పారు. ఆ కోటరీ జగన్ చెవులు మూసేసిందని అంటున్నారు.  అందుకే కోట‌రీ చ‌ట్రంలో బందీ అయిన జ‌గ‌న్  అప్రమత్తం చేయడానికి విజయసాయి   వెనుజువెలా  అధ్యక్షుడితో పోల్చి చెప్పారు.  

ఇక జగన్ విషయానికి వస్తే..  ర‌ప్పా ర‌ప్పా అంటూ వీధుల్లో చేరి బ్యాన‌ర్లు క‌ట్టి, జంతు బలులు ఇచ్చి మరీ పేట్రేగి పోవడంతో  జనం జ‌డుసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. గత ఎన్నికలలో వచ్చిన పదకొండు స్థానాలూ, 2029 ఎన్నికలలో ఒకటికి పడిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటు న్నారు. అది గుర్తించే విజయసాయి జ‌గ‌న్కి  హితోప‌దేశ వేణుగానం వినిపించే యత్నం చేస్తున్నారం టున్నారు. 

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.