కరోనా ఏంటో మందిని అనాథలను చేసింది. ఎన్నో కుటుంబాలను కన్నీటి పర్వంలో ముంచింది. దాదాపు అందరిని ఆర్థికంగా కుదిపేసింది. మరికొందరిలో మానవత్వాన్ని కూడా చంపేసింది. బంధువులను బంధుత్వాన్ని దూరం చేసింది. కరోనా వల్ల మనిషిలో మానవత్వం నశించిపోయి చనిపోయిన శవం తో ఒకడు వాడి కోరిక తీర్చుకుంటే, ఆ పేషేంట్స్ మేడలో ఉన్న బంగారాన్ని దొంగిలించాడు మరొకడు. అత్తకు కరోనా వచ్చిందని తాను చనిపోతే కోడలు హాయిగా ఉంటుందని కోడలికి కరోనా అంటించిన అత్తని చూశాం.. తాజాగా అలాంటిదే ఇంకో సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటో తెలుసుకుందాం..?
అది మంచిర్యాల జిల్లా. ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. తన భార్య కరోనా సోకిందని ఆమెను ఏకంగా బాత్రూంలో బంధించాడు. తెలియని తనమో, లేక కరోనా తనకు కూడా సోకుందనే భయమో తెలీదు గానీ తన భార్యను స్నానాల గది నుంచి రానివ్వకుండా చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టి పేట పట్టణంలో చోటు చేసుకుంది. అయితే, ఆమె గత ఏడు రోజులుగా బాత్రూంలో ఉంటున్నట్లుగా స్థానికులు చెప్పారు. బాత్రూంలోనే ఉంటూ ఆమె నరకయాతన అనుభవించింది. తన భర్త తనకు అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేదని రోదించింది.
ఏదో విధంగా ఆమె బాధ స్థానికులకు తెలిసింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లి బాత్రూంలో ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చి ఓ గదిలో హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
కరోనా వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్లే భర్తని చూశాం గాని మరి ఇంత దారుణంగా ప్రవర్తించే భర్తలు కూడా ఉంటారని చెలిసింది.. ఈ ఘటన పబ్లిక్ అయింది కాబట్టి తెలిసింది. ఇంకా ఇలాంటి ఘటనలు చీకటి చాటున ఎన్ని ఉన్నాయో.. ఏది ఏమైనా కరోనా టైం లో ఫ్యామిలి వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలేగాని.. ఇలా వ్యాదికంటే ముందే మనం చంపొద్దు.. ఏదేమైనా కరోనా చాలా గుణపాఠాలు నేర్పిందనే చెప్పాలి.. అందులో ముఖ్య మన వాళ్ళు ఎవరో.. మన మేలు కోరేవాళ్ళు ఎవరో.. ఎవరు నటిస్తున్నారో.. ఎవరు జీవిస్తున్నారో ఎవరు బంధువులో ఎవరు బద్మాష్ గాల్లో అందరికి తెలిసివచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/wife-covid-husband-puts-her-bathroom-25-116926.html
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.